Ukraine Crisis: విద్యార్థులు తప్ప ప్రవాసాంధ్రులు మమ్మల్ని సంప్రదించలేదు: కృష్ణబాబు
ఉక్రెయిన్లో చిక్కుకున్న 423మంది ఏపీ విద్యార్థులను మ్యాపింగ్ చేశామని రాష్ట్ర రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు తెలిపారు.
అమరావతి: ఉక్రెయిన్లో చిక్కుకున్న 423మంది ఏపీ విద్యార్థులను మ్యాపింగ్ చేశామని రాష్ట్ర రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు తెలిపారు. మ్యాపింగ్ చేసిన వాళ్లతో వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి సూచనలిస్తున్నామన్నారు. 23 మంది విద్యార్థులు వస్తున్నారని కేంద్రం సమాచారం ఇచ్చినట్లు ఆయన చెప్పారు. కాగా ఏపీకి చెందిన ముగ్గురే ఉన్నట్లు తమ పరిశీలనలో తెలిందని కృష్ణబాబు వివరించారు. ఉక్రెయిన్ నుంచి ఏపీ విద్యార్థులను తీసుకొచ్చేందుకు ఏపీ ప్రభుత్వం కృష్ణబాబు నేతృత్వంలో నిన్న టాస్క్ఫోర్స్ కమిటీని నియమించింది. ఈ సందర్భంగా ఆయన ఇవాళ మీడియాతో మాట్లాడారు.
‘‘దిల్లీలో ఎయిర్పోర్టులో ఏపీ భవన్ తరఫున హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశాం. సరిహద్దు ప్రాంతాలకు వెళ్లొద్దని భారతీయులకు సూచనలు వచ్చాయి. సరిహద్దులకు వెళ్లొద్దని విద్యార్థులకు సూచిస్తున్నాం. ఉక్రెయిన్లోని ఏడు వర్సిటీల్లో ఏపీ విద్యార్థులు చదువుతున్నారు. వర్సిటీల సమీపంలోని రొమేనియన్ ఎంబసీని సంప్రదిస్తున్నాం. విద్యార్థులు తప్ప ఉక్రెయిన్లోని ప్రవాసాంధ్రులు మమ్మల్ని సంప్రదించలేదు. ఎంతమంది ఆంధ్రులు ఉక్రెయిన్లో ఉన్నారనే వివరాలు రాబడుతున్నాం. వీసా స్టాంపింగ్, ఐబీ, విదేశీ విద్యలకు పంపే ఏజెన్సీల ద్వారా సమాచారం సేకరిస్తున్నాం’’ అని కృష్ణబాబు అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం
-
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
-
విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
-
వైకాపా వెన్నులో వణుకు.. చెమటలు పట్టిస్తున్న పూతలపట్టు కాంగ్రెస్ అభ్యర్థి
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం