CM Jagan: స్కూళ్లు తెరిచే నాటికి విద్యాకానుక అందించాలి: సీఎం జగన్
స్కూళ్లు తెరిచే నాటికి విద్యాకానుక అందించేలా చర్యలు తీసుకోవాలని ఏపీ సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. తగినన్ని తరగతి గదులు అందుబాటులో ఉండేలా చూసుకోవాలన్నారు.
అమరావతి: స్కూళ్లు తెరిచే నాటికి విద్యాకానుక అందించేలా చర్యలు తీసుకోవాలని ఏపీ సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. తగినన్ని తరగతి గదులు అందుబాటులో ఉండేలా చూసుకోవాలన్నారు. దశలవారీగా ఆరు కేటగిరీల స్కూళ్లు ఏర్పాటు కావాలన్న సీఎం... స్కూళ్లవారీగా సబ్జెక్టులకు అనుగుణంగా టీచర్లను పెట్టాలని సూచించారు. విద్యాశాఖపై క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించిన సీఎం.. నాడు-నేడు రెండోదశ వేగం పెంచాలని ఆదేశించారు. శరవేగంగా పనులు పూర్తి చేసి రెండో విడత పూర్తి చేయాలన్నారు. రెండో దశ కింద దాదాపు 25వేల స్కూళ్లలో పనులు చేపట్టామని, వీటి ద్వారా పాఠశాలల్లో గణనీయమైన మార్పులు కనిపించాలని తెలిపారు.
ఈ విద్యాసంవత్సరంలో 8వ తరగతి ఆంగ్ల మాధ్యమంలోకి మార్చాలన్నారు. ప్రభుత్వ వసతి గృహాల్లోనూ నాడు-నేడు కింద పనులు చేపట్టాలని సూచించారు. నాడు-నేడు రెండో దశ ఖర్చు అంచనా రూ.11,267 కోట్లుగా నిర్ణయించినట్టు సీఎం తెలిపారు. నాడు-నేడు కింద 468 జూనియర్ కళాశాలల్లో పనులు చేపట్టినట్టు తెలిపారు. దీంతో పాటు ప్రతి మండలానికి రెండు జూనియర్ కళాశాలలు ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశానికి సీఎస్ సమీర్శర్మ, పాఠశాల విద్యాశాఖ స్పెషల్ సీఎస్ బుడితి రాజశేఖర్, ఆర్థికశాఖ కార్యదర్శి ఎన్.గుల్జార్, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్.సురేశ్కుమార్, పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఈ సమావేశానికి గైర్హాజరయ్యారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434
-
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం
-
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
-
విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?