పోలవరం ప్రాజెక్టును సందర్శించిన సీఎం జగన్‌

ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి పోలవరం ప్రాజెక్టును సందర్శించారు.

Updated : 14 Dec 2020 11:55 IST

పోలవరం : ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో బయలుదేరిన సీఎం ప్రాజెక్టు పనుల తీరును విహంగవీక్షణం ద్వారా పరిశీలించారు. ప్రాజెక్టు స్పిల్‌వే వద్ద అధికారులు ఏర్పాటు చేసిన ఫోటో గ్యాలరీని సీఎం తిలకించారు. అనంతరం ప్రాజెక్టు సమావేశ మందిరంలో సీఎం ఇంజినీర్లు, అధికారులు, గుత్తేదారులతో సమావేశమయ్యారు. జగన్‌ సీఎంగా ప్రమాణం చేసిన తర్వాత 2019 జూన్‌లో తొలిసారిగా పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. అనంతరం ఈ ఏడాది ఫిబ్రవరిలో రెండోసారి వెళ్లారు. తాజా పర్యటన మూడోది.

 

ఇదీ చదవండి
ఏపీ గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షలు ప్రారంభం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని