Hyderabad: రాష్ట్రపతి నిలయంలో ఎట్‌ హోమ్‌.. హాజరైన గవర్నర్‌, సీఎం సహా ప్రముఖులు

శీతాకాల విడిది కోసం హైదరాబాద్‌ వచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తేనీటి విందు ఇచ్చారు.

Updated : 22 Dec 2023 21:15 IST

హైదరాబాద్‌: శీతాకాల విడిది కోసం హైదరాబాద్‌ వచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu) తేనీటి విందు ఇచ్చారు. శుక్రవారం సాయంత్రం బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో జరిగిన ఎట్ హోమ్‌ కార్యక్రమానికి గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ (Tamilisai Soundararajan), రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Revanth reddy) దంపతులు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అలోక్‌ అరాధే దంపతులు హాజరయ్యారు. మాజీ గవర్నర్‌ విద్యాసాగర్‌రావు, శాసనసభ స్పీకర్‌ ప్రసాదరావు, శాసనమండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, రాష్ట్ర మంత్రులు, పలువురు కాంగ్రెస్‌, భారాస ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు తదితరులు రాష్ట్రపతి ఎట్‌ హోమ్‌ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని