Atchannaidu: సజ్జల కుటుంబానికి రెండు ఓట్లు.. ఈసీకి అచ్చెన్న ఫిర్యాదు

రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబానికి రెండు ఓట్లు ఉండటంపై కేంద్ర ఎన్నికల కమిషన్‌కు తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఫిర్యాదు చేశారు.

Published : 15 Feb 2024 16:47 IST

అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబానికి రెండు ఓట్లు ఉండటంపై కేంద్ర ఎన్నికల కమిషన్‌కు తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఫిర్యాదు చేశారు. సజ్జల కుటుంబం డబుల్ ఓట్ల వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించి చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్రంలో అధికార పార్టీకి అనుకూలంగా ఓట్లు చేరుస్తూ.. ప్రతిపక్ష సానుభూతిపరుల ఓట్లు తొలగించడంపై ఈసీకి అనేకసార్లు ఫిర్యాదు చేశామన్నారు. అయినా, కొందరు అధికారులు లెక్కచేయకుండా అధికార పార్టీతో కుమ్మక్కై డబుల్ ఓట్లు, మరణించిన వారి ఓట్లు తొలగించలేదన్నారు. సజ్జల కుటుంబానికి మంగళగిరి, పొన్నూరు రెండు నియోజకవర్గాల్లో ఓట్లు ఉన్నాయని, వాటికి సంబంధించిన ఆధారాలను లేఖతో జతచేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని