Nara Bhuvaneswari: ·రైలు ప్రమాద బాధితులను పరామర్శించిన నారా భువనేశ్వరి

విజయనగరం సర్వజన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రైలు ప్రమాద క్షతగాత్రులను నారా భువనేశ్వరి పరామర్శించారు. 

Updated : 31 Oct 2023 14:45 IST

విజయనగరం: కంటకాపల్లి-అలమండ మధ్య జరిగిన రైలు ప్రమాదంలో గాయపడి విజయనగరం సర్వజన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను నారా భువనేశ్వరి (Nara Bhuvaneswari) పరామర్శించారు. తెలుగుదేశం నేతలు అశోక్‌ గజపతిరాజు, కళా వెంకట్రావు, వంగలపూడి అనిత తదితరులతో కలిసి విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లిన భువనేశ్వరి బాధితుల ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని