Krishna Tribunal: కృష్ణా ట్రైబ్యునల్ గడువు పొడిగింపు.. కేంద్ర జల్‌శక్తి శాఖ ఉత్తర్వులు

కృష్ణా జల వివాదాల పరిష్కార ట్రైబ్యునల్‌ గడువును కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. ఈ మేరకు కేంద్ర జల్‌శక్తి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

Published : 08 Jul 2023 19:55 IST

దిల్లీ: కృష్ణా జల వివాదాల పరిష్కార ట్రైబ్యునల్‌ గడువును కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. 2024 మార్చి 31 వరకు ట్రైబ్యునల్‌ గడువును పొడిగిస్తూ కేంద్ర జల్‌శక్తి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. జల వివాదాల పరిష్కారానికి సంబంధించిన తీర్పు వెల్లడించాల్సి ఉన్నందున గడువును పొడిగించినట్టు కేంద్రం తెలిపింది. ఈ ఏడాది ఆగస్టు 1 నాటికి తీర్పు వెలువరించాల్సి ఉంది. అయితే, ఇరు రాష్ట్రాల వాదనలు ఇంకా కొనసాగుతుండటం, తీర్పునకు మరికొంత సమయం పట్టనున్న నేపథ్యంలో ట్రైబ్యునల్‌ గడువును కేంద్రం పొడిగించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని