హైదరాబాద్‌లో టీకా టెస్టింగ్‌ సెంటర్‌: కిషన్‌రెడ్డి

నెల రోజుల్లో హైదరాబాద్‌లో వ్యాక్సిన్‌ టెస్టింగ్‌ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు.

Updated : 24 Sep 2022 17:08 IST

 

దిల్లీ: నెల రోజుల్లో హైదరాబాద్‌లో వ్యాక్సిన్‌ టెస్టింగ్‌ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. పీఎం కేర్స్‌ నిధులతో దీన్ని ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. దిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘దేశంలో కేవలం రెండు వ్యాక్సిన్‌ టెస్టింగ్‌ కేంద్రాలే ఉన్నాయి. హైదరాబాద్‌లో మూడో వ్యాక్సిన్‌ సెంటర్‌ ఏర్పాటు కాబోతోంది. భాగ్యనగరం ఫార్మా, పరిశోధన సంస్థలకు కేంద్రంగా ఉంది. వ్యాక్సిన్‌ టెస్టింగ్‌ కేంద్రం రావడం హైదరాబాద్‌కు తలమానికం. టీకా టెస్టింగ్‌ సెంటర్‌కు అవకాశం కల్పించిన ప్రధానికి కృతజ్ఞతలు’’ అని కిషన్‌రెడ్డి అన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని