డబ్బుల్లేక గుహలో నివాసం ఉన్నారు
ఉత్తరాఖండ్లోని పుణ్యక్షేత్రం రిషికేశ్ సందర్శనకు వచ్చారు ఆ ఆరుగురు విదేశీయులు. రెండు నెలలు అక్కడే గడిపారు. అంతలో కరోనా కట్టడి చర్యల్లో భాగంగా కేంద్రం లాక్డౌన్ విధించింది. దీంతో ఎటూ వెళ్లలేని పరిస్థితి.
రిషికేశ్లో ఆరుగురు విదేశీయుల గుర్తింపు
రిషికేశ్: ఉత్తరాఖండ్లోని పుణ్యక్షేత్రం రిషికేశ్ సందర్శనకు వచ్చారు ఆ ఆరుగురు విదేశీయులు. రెండు నెలలు అక్కడే గడిపారు. అంతలో కరోనా కట్టడి చర్యల్లో భాగంగా కేంద్రం లాక్డౌన్ విధించింది. దీంతో ఎటూ వెళ్లలేని పరిస్థితి. అసలే కొత్త ప్రాంతం.. మరోవైపు తెచ్చుకున్న డబ్బులూ అయిపోయాయి. ఏం చేయాలో పాలుపోక చివరకు వారు ఓ గుహలోకి వెళ్లిపోయారు. మార్చి 24వ తేదీ నుంచి అక్కడే కాలం వెళ్లదీస్తున్న వారిని స్థానికుల సాయంతో ఎట్టకేలకు గుర్తించిన పోలీసులు.. శనివారం సాయంత్రం క్వారంటైన్కు తరలించారు.
గంగానది నుంచి నీళ్లు..
ఈ బృందంలో ముగ్గురు పురుషులు, ముగ్గురు మహిళలు ఉన్నారు. మొత్తం ఆరుగురిలో ఉక్రెయిన్ నుంచి ఇద్దరు, టర్కీ, అమెరికా, ఫ్రాన్స్, నేపాల్ నుంచి ఒక్కొక్కరు చొప్పున ఉన్నారని పోలీసులు వెల్లడించారు. ‘హోటల్లో ఉండేందుకు డబ్బులు లేక వారు తమ సామగ్రితోసహా గుహలోకి చేరిపోయారు. వంటచెరకుతో వంట చేసుకున్నారు. గంగానదిలోనుంచి నీళ్లను తెచ్చుకున్నారు. ప్రస్తుతం వారందరినీ క్వారంటైన్కు తరలించాం. వైద్య పరీక్షల్లో ఎవరిలోనూ కరోనా లక్షణాలు బయటపడలేదు’ అని వివరించారు. మరోవైపు నేటికి దాదాపు 600-700 వరకు విదేశీయులు రిషికేశ్లో చిక్కుకున్నట్లు సమాచారం. వారి వారి దేశాల చొరవతో క్రమక్రమంగా స్వదేశాలకు తరలుతున్నారని పోలీసులు వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
-
టీఎస్బీపాస్తోనే అనుమతులు.. డీపీఎంఎస్ విధానం పూర్తిగా నిలుపుదల
-
కొండయ్య.. లెక్కే వేరు
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
-
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి
-
‘యూటీఎస్’ పరిధి పెంపు.. ఇక ఎంత దూరం నుంచైనా జనరల్ టికెట్ కొనచ్చు..