దిల్లీలో మరోసారి కంపించిన భూమి
దేశ రాజధాని దిల్లీలో ఆదివారం మరోసారి భూమి కంపించిది. నెల రోజుల వ్యవధిలో దిల్లీలో భూమి కంపించడం ఇది మూడోసారి. భూకంపం కేంద్రం ఈశాన్య దిల్లీలోని వాజిర్పూర్లో ప్రాంతంలో....
దిల్లీ: దేశ రాజధాని దిల్లీలో ఆదివారం మరోసారి భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 3.4గా నమోదయినట్లు జాతీయ భూకంప అధ్యయన విభాగం (ఎన్సీఎస్) తెలిపింది. నెల రోజుల వ్యవధిలో దిల్లీలో భూమి కంపించడం ఇది మూడోసారి. భూకంపం కేంద్రం ఈశాన్య దిల్లీలోని వాజిర్పూర్లో ప్రాంతంలో ఉన్నట్లు ఎన్సీఎస్ అధిపతి జే.ఎల్. గౌతమ్ తెలిపారు. దాదాపు ఐదు కిలోమీర్లు లోతు వరకు భూమి కంపించిందని వెల్లడించారు. గత నెల 12, 13 తేదిల్లో కూడా వాజిర్పూర్ పరిసర ప్రాంతాలు కేంద్రంగా 3.5, 2.7 తీవ్రతతో రెండు సార్లు భూమి కంపించిందని ఎన్సీఎస్ తెలిపింది. భూకంపం రావడానికి అవకాశం ఉన్న ఐదు జోన్లలో దిల్లీ నాలుగో జోన్లో ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
‘దేవర’లో కీలక పాత్ర.. అల్లరి నరేశ్ ఏమన్నారంటే?
-
తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి
-
నేనెందుకు సమాధానం చెప్పాలి?: వరలక్ష్మీ శరత్కుమార్
-
అతిపెద్ద ఎయిర్పోర్టు.. 400 గేట్లు.. రూ.2.9 లక్షల కోట్ల ఖర్చు!
-
చైనాతో చర్చలు.. భారత్ ఎప్పుడూ తలవంచదు: రాజ్నాథ్ సింగ్
-
ఎస్బీఐ కార్డు నుంచి 3 ట్రావెల్ క్రెడిట్ కార్డులు.. ప్రయోజనాలివే..!