నల్లకోటు కొన్నాళ్లిక ఉండదు
వీడియో కాన్ఫరెన్సుల ద్వారా పాల్గొనే విచారణల్లో న్యాయవాదులు సంప్రదాయ నలుపు రంగు కోట్లు, గౌన్లను ధరించనవసరంలేదని సుప్రీంకోర్టు తెలిపింది. ఈ మేరకు బుధవారం సాయంత్రం ఓ ప్రకటన జారీచేసింది. కరోనా విపత్తు సమసిపోయే వరకూ లేదా
కరోనా నేపథ్యంలో న్యాయవాదులకు కొత్త డ్రెస్ కోడ్
ఈనాడు, దిల్లీ: వీడియో కాన్ఫరెన్సుల ద్వారా పాల్గొనే విచారణల్లో న్యాయవాదులు సంప్రదాయ నలుపు రంగు కోట్లు, గౌన్లను ధరించనవసరంలేదని సుప్రీంకోర్టు తెలిపింది. ఈ మేరకు బుధవారం సాయంత్రం ఓ ప్రకటన జారీచేసింది. కరోనా విపత్తు సమసిపోయే వరకూ లేదా తదుపరి ఆదేశాలు ఇచ్చేంతవరకూ దీన్ని అనుసరించాలని సూచించింది. ‘‘వైద్య నిపుణుల సూచనల మేరకు... కొవిడ్-19 వ్యాప్తిని నిలువరించేందుకు సంప్రదాయ కోట్లు, గౌన్లను ధరించవద్దు. విచారణ సమయంలో న్యాయవాదులు ఎలాంటి డిజైన్లు లేని తెలుపు చొక్కా/సల్వార్-కమీజ్/తెల్ల చీర, తెలుపు రంగు నెక్ బ్యాండ్ను ధరించాలి’’ అని అందులో పేర్కొంది. అంతకుముందు ఉదయం ఓ ప్రజాప్రయోజన వ్యాజ్యంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్.ఎ.బోబ్డే వీడియో ద్వారా విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా సహచర న్యాయమూర్తులు, న్యాయవాదులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ-‘‘నలుపు రంగు కోట్లు, గౌన్లను కొంతకాలం ధరించడం మానుకుందాం. వాటి ద్వారా వైరస్ సులభంగా వ్యాపించే ముప్పుంది’’ అని వ్యాఖ్యానించారు. జస్టిస్ బోబ్డ్డే, ఇతర న్యాయమూర్తులు తెెల్ల చొక్కాలపై నెక్ బ్యాండ్లను ధరించి విచారణ చేపట్టారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.