ప్రభుత్వ స్థలాలకు జియో ఫెన్సింగ్: కేటీఆర్‌

ప్రభుత్వ భూముల పరిరక్షణకు కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ మంత్రి కేటీఆర్‌ అధికారులను ఆదేశించారు.

Updated : 27 Jun 2020 16:09 IST

హైదరాబాద్‌: ప్రభుత్వ భూముల పరిరక్షణకు కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ మంత్రి కేటీఆర్‌ అధికారులను ఆదేశించారు. హైదరాబాద్‌లో ప్రభుత్వ భూముల రక్షణ చర్యలపై మంత్రులు, ఉన్నతాధికారులతో కేటీఆర్‌ చర్చించారు. ప్రభుత్వ స్థలాలకు జియో ఫెన్సింగ్, జీఐఎస్‌ మ్యాపింగ్‌ చేయాలని ఆదేశించారు. అర్హులైన పేదలకు భూములు క్రమబద్ధీకరించి హక్కులు కల్పించాలని చెప్పారు. దశాబ్దాల క్రితం లీజులను సమీక్షించాలని మంత్రి కేటీఆర్‌ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ప్రభుత్వ భూముల పరిరక్షణకు రెవెన్యూ, జీహెచ్‌ఎంసీ కలసి పని చేయాలని సూచించారు. ప్రభుత్వ స్థలాలను ప్రజా ప్రయోజనాలకు వినియోగించడంపై పరిశీలించాలని కేటీఆర్‌ పేర్కొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని