AP: రికార్డుస్థాయిలో 37 కరోనా మరణాలు
ఆంధ్రప్రదేశ్లో గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో కరోనా మరణాలు నమోదయ్యాయి. ఆదివారం ఉదయం 9 నుంచి సోమవారం ఉదయం 9 వరకు 36 మంది కరోనాతో చనిపోయారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో కరోనా మరణాలు నమోదయ్యాయి. ఆదివారం ఉదయం 9 నుంచి సోమవారం ఉదయం 9 వరకు 37 మంది కరోనాతో చనిపోయారు. ఇప్పటివరకు ఇదే అత్యధికం. ఈ రోజు తాజాగా 1,935 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 1,919 రాష్ట్రానికి చెందినవారు కాగా, ఇతర రాష్ట్రాల వారు 13 మంది ఉన్నారు. ఇతర దేశాల నుంచి వచ్చినవారు ముగ్గురు ఉన్నారు. ఇప్పటివరకు 31,103 మందికి కరోనా సోకింది. అందులో రాష్ట్రానికి చెందినవారు 28,255 మంది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 2,416 మంది కరోనా పాజిటివ్ రాగా, ఇతర దేశాల నుంచి వచ్చిన 432 మందిలో కరోనా ఉన్నట్లు గుర్తించారు.
ప్రస్తుతం రాష్ట్రంలో 14,274 యాక్టివ్ కేసులున్నాయి. ఇందులో 11,958 మంది వివిధ ఆస్పత్రుల్లోను, 2,316 మంది కొవిడ్ సెంటర్లలోనూ వైద్యం పొందుతున్నారు. వీరిలో రాష్ట్రానికి చెందినవారు 13,615 మంది. 550 మంది ఇతర రాష్ట్రాలవారు కాగా, 109 మంది ఇతర దేశాలవారు. ఈ రోజు డిశ్ఛార్జి అయిన 1,030 మందితో కలిపి మొత్తంగా 16,464 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 365 మంది కొవిడ్ సోకి చనిపోయారు.
జిల్లాల వారీగా వివరాలు ఇలా...
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు. -
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
Viral Video: స్పైడర్ మ్యాన్, స్పైడర్ ఉమెన్ దుస్తుల్లో దిల్లీ రోడ్లపై చక్కర్లు కొట్టిన జంటను పోలీసులు అరెస్టు చేశారు. ఎందుకంటే?
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్