Andhra News: ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. డీఏ మంజూరు

ఉద్యోగులకు డీఏ, పింఛనర్లకు 2.73 శాతం డీఆర్‌ మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Published : 01 May 2023 20:41 IST

అమరావతి: ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ చెప్పింది. 2022 జనవరి 1 నుంచి ఇవ్వాల్సిన డీఏ బకాయిలను మంజూరు చేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్యోగులకు డీఏ, పింఛనర్లకు 2.73 శాతం డీఆర్‌ మంజూరు చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. 2023 జూన్‌ 1 నుంచి కొత్త డీఏను జీతంతో కలిపి ఇస్తామని తెలిపింది. డీఏ బకాయిలను 3 సమాన వాయిదాల్లో సెప్టెంబర్‌, డిసెంబర్‌, మార్చిలో చెల్లిస్తామని వెల్లడించింది. కొత్త డీఏతో కలిపి ఉద్యోగుల డీఏ 22.75 శాతానికి చేరిందని ప్రభుత్వం వివరించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని