స్వచ్ఛ సర్వేక్షణ్లో ఉత్తమ ర్యాంకే లక్ష్యంగా..
స్వచ్ఛ సర్వేక్షణ్లో ఉత్తమ ర్యాంకు సాధించడంపై తెలంగాణ ప్రభుత్వం దృష్టిసారించింది. పట్టణాల్లో ఏర్పాటుచేసిన ప్రజా శౌచాలయాలు సహా మానవ వ్యర్థాల శుద్ధి కేంద్రాల సమర్థ నిర్వహణతో మంచి ర్యాకులు సాధించాలని ప్రభుత్వం భావిస్తోంది....
ప్రత్యేక శ్రద్ధ చూపాలని పురపాలకశాఖ ఆదేశం
ఇంటర్నెట్ డెస్క్: స్వచ్ఛ సర్వేక్షణ్లో ఉత్తమ ర్యాంకు సాధించడంపై తెలంగాణ ప్రభుత్వం దృష్టిసారించింది. పట్టణాల్లో ఏర్పాటుచేసిన ప్రజా శౌచాలయాలు సహా మానవ వ్యర్థాల శుద్ధి కేంద్రాల సమర్థ నిర్వహణతో మంచి ర్యాకులు సాధించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆ దిశగా నిర్వహణపై ప్రత్యేకంగా శ్రద్ధ చూపాలని అధికారులను పురపాలక శాఖ ఆదేశించింది. మార్చిలో చేపట్టనున్న స్వచ్ఛ సర్వేక్షణ్-2021లో తెలంగాణ పేరును నిలబెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రంలో ఇప్పటికే 40 పట్టణాలకు ఓడీఎఫ్+ గుర్తింపు ఉంది. జీహెచ్ఎంసీ, గ్రేటర్ వరంగల్, కరీంనగర్ కార్పొరేషన్లతోపాటు వికారాబాద్, నల్గొండ, నిర్మల్ మున్సిపాలిటీలకు ఓడీఎఫ్++ గుర్తింపు ఉంది. రాష్ట్రంలో ఇప్పటివరకు 68 పట్టణాల్లో తనిఖీలు పూర్తికాగా.. 22 పట్టణాలకు సంబంధించిన ఫలితాలు రావాల్సి ఉంది. స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వేలోపు ఫలితాలు వచ్చే అవకాశం ఉంది.
రాష్ట్రంలో పురపాలకశాఖ ప్రత్యేక డ్రైవ్ చేపట్టి జీహెచ్ఎంసీతోపాటు అన్ని పట్టణాల్లో దాదాపు 8 వేలకు పైగా ప్రజా మరుగుదొడ్లు, మహిళల కోసం షీ టాయిటెట్లు నిర్మించింది. కాలం చెల్లిన ఆర్టీసీ బస్సులను మొబైల్ టాయిలెట్లుగా మార్చింది. మరుగుదొడ్ల నిర్వహణకు అధికారులు సమగ్ర క్యూఆర్ కోడ్ విధానం అమలు చేస్తున్నారు. మానవ వ్యర్థాల శుద్ధి కోసం ఫీకల్ స్లడ్జ్ ట్రీట్మెంట్ ప్లాంట్ను ఏర్పాటుచేశారు. ఇప్పటికే కొన్ని చోట్ల అవి ప్రారంభం కాగా, మరికొన్ని చోట్ల అవి పూర్తయ్యాయి. పెద్ద సంఖ్యలో ప్రజా శౌచాలయాలు నిర్మించినా.. చాలా చోట్ల వాటి నిర్వహణలో లోపాలతో ఓడీఎఫ్+, ఓడీఎఫ్++ హోదా పొందడంలో విఫలమవుతున్నాయని అధికారులు గుర్తించారు. ఆ ప్రభావం స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకులపై పడకుండా ప్రజా మరుగుదొడ్ల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని మున్సిపల్ కమిషనర్లను ప్రభుత్వం ఆదేశించింది. అన్ని సదుపాయాలు కల్పించడం సహా పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని హెచ్చరించింది. ఇందుకోసం ప్రత్యేకంగా డ్రైవ్ చేపట్టాలని సూచించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
అష్టాదశ శక్తి పీఠక్షేత్రమైన శ్రీశైలం(Srisailam)లో కుంభోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి ఆలయాన్ని నిమ్మకాయలతో అలంకరించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం