Andhra News: ఉరకలెత్తుతున్న కృష్ణమ్మ.. ప్రాజెక్టులకు భారీగా వరద
వరద ఉద్ధృతితో కృష్ణమ్మ ఉప్పొంగి ప్రవహిస్తోంది. జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్ జలశయాల గేట్లన్నీ ఎత్తివేయడంతో కృష్ణ నది బిరబిరా పరుగులు పెడుతుంది. జలాశయం
అమరావతి: వరద ఉద్ధృతితో కృష్ణమ్మ ఉప్పొంగి ప్రవహిస్తోంది. జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్ జలశయాల గేట్లన్నీ ఎత్తివేయడంతో కృష్ణ నది బిరబిరా పరుగులు పెడుతుంది. జలాశయం వద్ద జలసవ్వడితో సందడి నెలకొంది. ఎగువ నుంచి కొనసాగుతున్న భారీ వరదతో కృష్ణమ్మ ఉరకలేస్తోంది. దీంతో శ్రీశైలం జలశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. జూరాల, సుంకేసుల నుంచి శ్రీశైలానికి 3.63లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుంది.
శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం నీటిమట్టం 884.40 అడుగులుగా ఉంది. జలాశయంలో ప్రస్తుత పూర్తి నీటినిల్వ 215.80 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 212.43 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. జలాశయం 10 గేట్లను 15 అడుగుల మేర ఎత్తి అధికారులు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. స్పిల్వే ద్వారా 3.76 లక్షల క్యూసెక్కుల నీరు సాగర్వైపు పరుగులు పెడుతున్నాయి. శ్రీశైలం కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. విద్యుత్ ఉత్పత్తి ద్వారా 62,277 క్యూసెక్కుల నీరు సాగర్లో కలుస్తున్నాయి.
ఇప్పటికే పూర్తిస్థాయిలో నిండిన నాగార్జున సాగర్ జలశయానికి శ్రీశైలం నుంచి కొనసాగుతున్న వరద ప్రవాహన్ని అధికారులు దిగువకు పంపుతున్నారు. సాగర్ 26 గేట్ల ద్వారా 3.58 లక్షల క్యూసెక్కుల నీటిని కిందకు విడుదల చేస్తున్నారు. నాగార్జున సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 586.4 అడుగులుగా ఉంది. నాగార్జున సాగర్ పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 302.98 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
దిగువన ఉన్న పులిచింతల, ప్రకాశం బ్యారేజీకి వరద ప్రవాహం కొనసాగుతోంది. పులిచింతల ప్రాజెక్టు అన్ని గేట్లు ఎత్తి 3.40 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజీకి ఇన్ఫ్లో 3.57 లక్షల క్యూసెక్కులు ఉండగా.. అవుట్ ఫ్లో 3.43 లక్షల క్యూసెక్కులుగా ఉంది. బ్యారేజీ నుంచి 14,500 క్యూసెక్కుల నీటిని కాలువలకు వదులుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
-
టీఎస్బీపాస్తోనే అనుమతులు.. డీపీఎంఎస్ విధానం పూర్తిగా నిలుపుదల
-
కొండయ్య.. లెక్కే వేరు
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
-
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి
-
‘యూటీఎస్’ పరిధి పెంపు.. ఇక ఎంత దూరం నుంచైనా జనరల్ టికెట్ కొనచ్చు..