Hyderabad: ఓఆర్‌ఆర్‌పై మరింత వేగంతో దూసుకెళ్లొచ్చు

ఔటర్‌ రింగ్‌రోడ్డుపై వాహనాల ప్రయాణ వేగాన్ని పెంచుతున్నట్లు పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌ కుమార్‌ వెల్లడించారు.

Updated : 27 Jun 2023 17:22 IST

హైదారాబాద్‌: ఔటర్‌ రింగ్‌రోడ్డుపై వాహనాల ప్రయాణ వేగాన్ని పెంచుతున్నట్లు పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌ కుమార్‌ వెల్లడించారు. ప్రస్తుతం గంటకు 100 కి.మీ గరిష్ఠ వేగంతో ప్రయాణించేందుకు అనుమతి ఉందని, దీనిని 120కి.మీకి పెంచుతున్నట్లు చెప్పారు. ఓఆర్‌ఆర్‌పై ప్రయాణికుల భద్రతకు మరిన్ని చర్యలు తీసుకుంటామన్నారు. భద్రతాపరమైన అంశాలపై పురపాలకశాఖ, ఓఆర్‌ఆర్‌ అధికారులతో మంత్రి కేటీఆర్‌ సమీక్ష నిర్వహించిన అనంతరం అర్వింద్‌కుమార్‌ ఈ ప్రకటన చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని