వైకల్యాన్ని జయించి.. పారాలింపిక్స్కు సన్నద్ధం
హిమాలయాలకు సైకిల్పై వెళ్లాలన్నది అతడి కల. ఒలింపిక్స్లో సత్తా చాటాలన్నదే ఆశయం. ఆ దృఢ సంకల్ప బలం ముందు వైకల్యం తల వంచక తప్పలేదు.
తిరువనంతపురం: హిమాలయాలకు సైకిల్పై వెళ్లాలన్నది అతడి కల. ఒలింపిక్స్లో సత్తా చాటాలన్నదే ఆశయం. ఆ దృఢ సంకల్ప బలం ముందు వైకల్యం తల వంచక తప్పలేదు. అతడి గుండె నిబ్బరానికి దాసోహమైన సైకిల్ పెడల్ ఒంటి కాలు కింద ఒరిగిపోయి కొండలు, లోయల్లో చక్కర్లు కొట్టిస్తోంది. ఆత్మస్థైర్యానికి నిదర్శనంగా నిలిచిన ఆ కేరళ యువకుడి కథేంటో ఓసారి తెలుసుకుందాం.
20ఏళ్ల వయసు, 14 శస్త్ర చికిత్సలు, రోజుకు 30మాత్రలు, అంతంత మాత్రం పని చేసే కిడ్నీలు. కానీ అవేవీ అతడిని నిరుత్సాహ పర్చలేదు. పారాలింపిక్స్లో సత్తాచాటేందుకు ఒంటి కాలితో సిద్ధమవుతున్నాడు కేరళ కుర్రాడు శ్యామ్కుమార్. తిరువనంతపురం బేయాడ్కు చెందిన శ్యామ్కుమార్ 3 కిడ్నీలతో జన్మించాడు. జన్యు లోపం వల్ల అతడి కుడికాలు వెనక భాగంలో కలిసిపోయింది. 8ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఆ కాలును వేరు చేయాల్సి వచ్చింది. అప్పటికే శ్యామ్ మూత్రపిండాలు పాక్షికంగా పని చేస్తున్నాయి. వీటికి తోడు పేదరికం. అయితే ఇవేవీ అతడిని ప్రభావితం చేయలేకపోయాయి. జీవితంలో ముందుకు సాగాలన్న శ్యామ్ సంకల్ప బలం ముందు జన్యులోపాలు ఓడిపోయాయి. అతడు తన శరీర ఆకృతికి సరిపోయేలా కృత్రిమ కాలును అమర్చుకున్నాడు. ప్రస్తుతం బీఎస్సీ సైకాలజీ చదువుతున్న శ్యామ్ ఆ కాలు సాయంతోనే కళాశాలకు సైకిల్పై వెళ్లేవాడు. రోజూ సమీపంలో ఉన్న కొండలు, లోయల్లో సుమారు 20కిలోమీటర్ల మేర చక్కర్లు కొడుతూ ఉండేవాడు. కృత్రిమ కాలు మరమ్మతులకు గురైన సమయంలో ఒంటికాలుతోనే సైకిల్ తొక్కేవాడు. నిరంతర సాధనతో సైక్లింగ్పై పట్టు సాధించాడు శ్యామ్. ఆ అనుభవంతోనే పారాలింపిక్స్లో దేశం తరఫున సత్తా చాటాలనుకుంటున్నాడు. ఎప్పటికైనా ప్రజాదరణ పొందే సైక్లింగ్ స్టార్ కావాలన్నదే తన ఆశయమని చెబుతున్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
అష్టాదశ శక్తి పీఠక్షేత్రమైన శ్రీశైలం(Srisailam)లో కుంభోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి ఆలయాన్ని నిమ్మకాయలతో అలంకరించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం