Polavaram: వరద తగ్గాకే పోలవరం కొత్త డయాఫ్రమ్ వాల్పై నిర్ణయం: సీడబ్ల్యూసీ
పోలవరం వద్ద వరద ప్రభావం తగ్గిన తర్వాత కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణం, డిజైన్లపై నిర్ణయం తీసుకుంటామని సీడబ్ల్యూసీ ఛైర్మన్ ఖష్విందర్ వోరా తెలిపారు.
దిల్లీ: పోలవరం వద్ద వరద ప్రభావం తగ్గిన తర్వాత కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణం, డిజైన్లపై నిర్ణయం తీసుకుంటామని సీడబ్ల్యూసీ ఛైర్మన్ ఖష్విందర్ వోరా తెలిపారు. క్షేత్రస్థాయిలో సమీక్షించాకే డయాఫ్రమ్ వాల్పై నిర్ణయం తీసుకుంటామన్నారు. వరద తగ్గాక తమ ముందున్న ప్రత్యామ్నాయాలు పరిశీలిస్తామన్నారు. అప్పర్, లోయర్ కాఫర్ డ్యామ్లను పరిశీలించాల్సి ఉందన్నారు. డిజైన్ విషయంలోనే జల సంఘం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు.
‘‘ఏపీ ప్రభుత్వం జవాబు ఆధారంగా డయాఫ్రమ్ వాల్పై నిర్ణయం ఉంటుంది. సాంకేతిక వివరాలన్నీ పంపాకే సమీక్షించి సీడబ్ల్యూసీ నిర్ణయం తీసుకుంటుంది. తప్పనిసరైతే పోలవరం ప్రాజెక్టును సందర్శిస్తాం. పోలవరంపై నిపుణుల కమిటీ వివరాలతో ఏపీ ప్రభుత్వం నుంచి లేఖ వచ్చింది’’ అని సీడబ్ల్యూసీ ఛైర్మన్ తెలిపారు. పోలవరం ప్రాజెక్టు (Polavaram)లో పూర్తిగా కొత్త డయాఫ్రం వాల్ నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. పాక్షికంగా కట్టడం కంటే.. పూర్తిస్థాయి నూతన నిర్మాణమే మేలని అంచనా వేస్తోంది. సమయం, ఖర్చు ముఖ్యం కాదని, నిర్మాణ భద్రతే ప్రధానమని అభిప్రాయపడుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
11 ఏళ్ల సుదీర్ఘ విచారణ తర్వాత ఎమ్మార్ కేసులో తీర్పు
11 ఏళ్ల సుదీర్ఘ విచారణ తర్వాత ఎమ్మార్ కేసులో డిశ్చార్జి పిటిషన్లపై సీబీఐ కోర్టు తీర్పు వెల్లడించింది. -
వివేకా హత్య తర్వాత అవినాష్.. జగన్కు ఫోన్ చేసి ఏం మాట్లాడారు?: సునీత
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య తర్వాత ఆధారాలను చెరిపేసిన ఎంపీ అవినాష్రెడ్డి.. జగన్కు ఫోన్ చేసి ఏం మాట్లాడారని వైఎస్ సునీత ప్రశ్నించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
బ్యాంకాక్ ఏషియా అందాల పోటీల్లో విశాఖ నివాసి మూడు టైటిల్స్ కైవసం
బ్యాంకాక్లో జరిగిన ఏషియా అందాల పోటీల్లో విశాఖ నివాసి డాక్టర్ వై.మమతా చౌదరి మూడు టైటిల్స్ కైవసం చేసుకున్నారు. -
రైళ్లలో చోరీలకు పాల్పడే ముఠా అరెస్టు
రైళ్లలో బంగారు ఆభరణాల చోరీకి పాల్పడుతున్న ముగ్గురు ముఠా సభ్యులను రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (30/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
మరో ‘బాహుబలి’ వచ్చేస్తోంది.. క్రేజీ అప్డేట్ ఇచ్చిన రాజమౌళి
-
ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్.. గెలాక్సీ ఎస్23పై ₹20వేలు డిస్కౌంట్
-
11 ఏళ్ల సుదీర్ఘ విచారణ తర్వాత ఎమ్మార్ కేసులో తీర్పు
-
ఇదే మా రిలేషన్షిప్ సీక్రెట్: జ్యోతిక
-
‘ఆ వీడియోలు నేనే ఇచ్చా’.. ప్రజ్వల్ మాజీ డ్రైవర్
-
జెఫ్ బెజోస్ నుంచి విలువైన పాఠం నేర్చుకున్నా: నెట్ఫ్లిక్స్ ఛైర్మన్