AP News: 4 కి.మీ. డోలీలో గర్భిణి
కాబోయే తల్లులకు మన్యంలో కష్టాలు, కన్నీళ్లు నిత్యకృత్యంగా మారాయి. మన్యంలో డోలీ మోతలకు స్వస్తి పలికేందుకుగానూ ప్రసవానికి వారంరోజులు ముందే గర్భిణులను సమీప ఆసుపత్రులకు తరలించాలని....
చింతపల్లి: కాబోయే తల్లులకు మన్యంలో కష్టాలు, కన్నీళ్లు నిత్యకృత్యంగా మారాయి. మన్యంలో డోలీ మోతలకు స్వస్తి పలికేందుకుగానూ ప్రసవానికి వారంరోజులు ముందే గర్భిణులను సమీప ఆసుపత్రులకు తరలించాలని అధికార యంత్రాంగం ఆదేశాలు జారీ చేస్తున్నా ఇవి క్షేత్రస్థాయిలో సక్రమంగా అమలు కావడంలేదు.తాజాగా మరో ఘటన వెలుగుచూసింది. విశాఖ మన్యంలోని తోకపాడుకు చెందిన గర్భిణిని ఆసుపత్రికి చేర్చేందుకు ఆమెను డోలీలో ఉంచి.. కొండ ప్రాంతం నుంచి ఏకంగా నాలుగు కిలోమీటర్లు ప్రయాణించి ఆమెను ఆసుపత్రిలో చేర్చారు.
చింతపల్లి మండలం బలపం పంచాయతీ తోకపాడుకు చెందిన కూసంగి చంద్రమ్మ(22)కు నెలలు నిండటంతో మంగళవారం రాత్రి నుంచి పురిటి నొప్పులు ప్రారంభమయ్యాయి. తోకపాడు గ్రామం నుంచి రోడ్డు పాయింట్కి వెళ్లాలంటే దట్టమైన అటవీ ప్రాంతంలో దాదాపు నాలుగు కిలోమీటర్లు ఉన్న కొండ ఎక్కాలి. చంద్రమ్మది మొదటి కాన్పు కావడంతో ఆశా కార్యకర్త గ్రామస్థులను అప్రమత్తం చేశారు. దీంతో బుధవారం ఉదయం చంద్రమ్మను డోలీలో ఎక్కించుకొని రోడ్డు పాయింట్కి తరలించారు. సుమారు నాలుగు కిలోమీటర్లు ఉన్న కొండ ఎక్కి అతి కష్టం మీద బలపం రోడ్డు పాయింట్కి ఆమెను మోసుకువచ్చారు. అక్కడి నుంచి లోతుగెడ్డ పీహెచ్సీకి తరలించేందుకు అంబులెన్కు ఫోన్ చేస్తే ఆ ప్రాంతానికి వచ్చేందుకు ఆలస్యమవుతుందని చెప్పడంతో ఓ ఆటోలో లోతుగెడ్డ పీహెచ్సీకి తీసుకెళ్లారు. తమ గ్రామానికి రహదారి సదుపాయం లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని తోకపాడు గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
అష్టాదశ శక్తి పీఠక్షేత్రమైన శ్రీశైలం(Srisailam)లో కుంభోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి ఆలయాన్ని నిమ్మకాయలతో అలంకరించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం