Nizamabad: పసుపు పంటకు మళ్లీ రికార్డు ధర.. ఈ సీజన్‌లో ఇదే అత్యధికం

పసుపు పంటకు రికార్డు ధర పలుకుతోంది. ఈ సీజన్‌లో ముందు నుంచి ఊపు మీదున్న ధరలు రోజురోజుకు ఎగబాకుతున్నాయి. 

Published : 29 Feb 2024 19:36 IST

నిజామాబాద్‌: పసుపు పంటకు రికార్డు ధర పలుకుతోంది. ఈ సీజన్‌లో ముందు నుంచి ఊపు మీదున్న ధరలు రోజురోజుకు ఎగబాకుతున్నాయి. నిజామాబాద్‌ వ్యవసాయ మార్కెట్‌ యార్డులో బుధవారం నాటి రికార్డు తాజాగా బ్రేక్‌ అయ్యింది. ఇవాళ క్వింటా పసుపు ధర గరిష్ఠంగా రూ.15,025 పలికింది. ఇదే ఈ సీజన్‌ అత్యధికం. బుధవారం క్వింటాకు రూ.14,255 చొప్పున ధర పలికిన విషయం తెలిసిందే. 2011లో క్వింటా ఆల్‌టైమ్‌ రికార్డు ధర రూ.16,166గా ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని