CCTV: ప్రయాణికుడి ప్రాణాలు కాపాడిన ఆర్పీఎఫ్‌

రైల్వే భద్రతా సిబ్బంది అప్రమత్తత కారణంగా ఓ వ్యక్తి ప్రాణాలతో బయటపడిన ఘటన ముంబయిలోని బోరిబరి రైల్వేస్టేషన్‌లో

Published : 01 Jul 2021 18:22 IST

ముంబయి: రైల్వే భద్రతా సిబ్బంది అప్రమత్తత కారణంగా ఓ వ్యక్తి ప్రాణాలతో బయటపడిన ఘటన ముంబయిలోని బొరివల్లి రైల్వేస్టేషన్‌లో జరిగింది. స్టేషన్ నుంచి వేగంగా వెళ్తున్న రైలు నుంచి ఓ ప్రయాణికుడు దిగేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తూ కిందపడి, రైలు ప్లాట్‌ఫాం మధ్య ఇరుక్కుపోయాడు. ఇది గమనించిన ఆర్పీఎఫ్‌ పోలీసు హుటాహుటీన అతని వద్దకు పరిగెత్తుకెళ్లి, ప్రమాదకర స్థితిలో ఉన్న అతన్ని పట్టుకుని వెనక్కి లాగాడు. ఆర్పీఎఫ్‌ జవాను అప్రమత్తత కారణంగా అతడు స్వల్పగాయాలతో బయటపడ్డాడు. జూన్‌ 29న ఈ ఘటన జరగ్గా, ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని