రూపాయి ఇచ్చి పాఠాలు చెబుతున్న టీచర్
పాఠశాలలో ఆరుగురు విద్యార్థులు మాత్రమే ఉండటాన్ని చూసిన ఓ టీచర్ ఆ పరిస్థితిని మార్చాలనుకున్నారు. పిల్లలను బడిలో చేర్పిస్తే వారి పేరుమీద డబ్బులు జమచేస్తానని తల్లిదండ్రులకు భరోసా కల్పించారు. రోజుకు రూపాయి జమచేస్తూ వారి నమ్మకాన్ని చూరగొన్నారు....
జీతంలో 30 శాతం విద్యార్థులకే!
కృష్ణా: పాఠశాలలో ఆరుగురు విద్యార్థులు మాత్రమే ఉండటం చూసిన ఓ టీచర్ ఆ పరిస్థితిని మార్చాలనుకున్నారు. పిల్లలను బడిలో చేర్పిస్తే వారి పేరుమీద డబ్బులు జమ చేస్తానని తల్లిదండ్రులకు భరోసా కల్పించారు. రోజుకు రూపాయి జమచేస్తూ వారి నమ్మకాన్ని చూరగొన్నారు. ఇలా పేద విద్యార్థులకు చదువుతోపాటు వారి బంగారు భవితకు బాటలు వేస్తున్నారు కృష్ణా జిల్లాలో పనిచేస్తున్న జె.పద్మావతి. ప్రస్తుతం అవనిగడ్డ మండలం బందలాయి చెరువు ప్రభుత్వ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్నారు.
పద్మావతిని అందరూ ‘రూపాయి టీచర్’ అని ముద్దుగా పిలుస్తారు. రోజూ పిల్లలకు రూపాయి ఇచ్చి విద్యాబుద్ధులు నేర్పుతారు. గతంలో అవనిగడ్డ మండలం గుడివాకవారి పాలెం పాఠశాలలో పనిచేసిన పద్మావతి.. బడిలో ఆరుగురు విద్యార్థులు ఉండటం గమనించారు. పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచాలనుకుని ఓ మంచి ఆలోచనకు శ్రీకారం చుట్టారు. పిల్లల పేరు మీద రికరింగ్ డిపాజిట్ (ఆర్డీ) అకౌంట్ తెరిచి, ప్రతి విద్యార్థి పేరుమీద రోజుకు రూపాయి చొప్పున.. నెలకు రూ. 30 జమచేయాలని భావించారు. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు తెలియజేసి తమ పిల్లలను పాఠశాలలో చేర్పించాలని కోరారు. ఆ టీచర్ మీద నమ్మకంతో అమ్మానాన్నలు తమ పిల్లలను బడిలో చేర్పించారు. అలా ఆరుగురు కాస్తా 45 మంది అయ్యారు.
పద్మావతి 30 శాతం జీతాన్ని విద్యార్థుల భవిష్యత్తు కోసమే ఖర్చు చేస్తున్నారు. పొదుపు ఖాతాల్లో డబ్బులు జమచేయడమే కాకుండా పిల్లలకు అవసరమైనప్పుడు పుస్తకాలు, పెన్నులు అందజేస్తున్నారు. అలా విద్యార్థులకు విద్యతోపాటు, పొదుపుపై పాఠాలు చెబుతూ.. వారి ఉన్నత భవిష్యత్తుకు బంగారు బాట వేస్తున్నారు. ఆమె ఏ పాఠశాలకు వెళ్లినా పొదుపు ఖాతాల విధానాన్ని కొనసాగిస్తున్నారు. ఆమె కృషిని విద్యార్థుల తల్లిదండ్రులు, తోటి ఉపాధ్యాయులు కొనియాడుతున్నారు. పేదలకు వీలైనంత సేవ చేయడమే లక్ష్యమంటున్న పద్మావతి, ఉద్యోగ విరమణ తర్వాత వృద్ధులకు సేవ చేస్తానంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏపీ నూతన డీజీపీ కోసం ముగ్గురు పేర్లతో ఈసీకి సిఫార్సు
ఏపీ డీజీపీ కేవీ రాజేంద్రనాథ్పై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) బదిలీ వేటు వేసిన సంగతి తెలిసిందే. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
దిల్లీ మద్యం కేసు.. కవితకు మళ్లీ చుక్కెదురు
దిల్లీ మద్యం కేసులో భారాస ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మళ్లీ చుక్కెదురైంది. బెయిల్ ఇచ్చేందుకు రౌస్ అవెన్యూ కోర్టు నిరాకరించింది. -
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్.. నేను ప్రత్యక్ష బాధితుడిని: విశ్రాంత ఐఏఎస్ అధికారి పీవీ రమేశ్
వైకాపా ప్రభుత్వం తీసుకొచ్చిన ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్’పై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఓటేశాక.. వృద్ధులను వదిలేశారు..
ఎన్నికల ముందు ప్రతిపక్షనేత హోదాలో పాదయాత్ర చేసిన జగన్ ఎన్నో హామీలు గుప్పించారు. అన్ని వర్గాలను మాటలతో మెప్పించి.. అనంతరం నిండా ముంచారు. -
జిల్లాలో తేలికపాటి వర్షాలు
జిల్లాలోని రెండు ప్రాంతాల్లో తేలిక పాటి వర్షాలు కురిశాయి. శనివారం సాయంత్రం నుంచి ఆదివారం ఉదయం వరకు నమోదైన వివరాల ప్రకారం.. మొత్తం 5.2 మిల్లీ మీటర్ల వర్షం పడగా, సగటు వర్షపాతం 0.26 మి.మీ.గా ఉంది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (06/05/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు ఉగ్ర ముప్పు..! స్పందించిన ట్రినిడాడ్ పీఎం, ఐసీసీ
-
ఏపీ నూతన డీజీపీ కోసం ముగ్గురు పేర్లతో ఈసీకి సిఫార్సు
-
పలు పాఠశాలలకు బెదిరింపులు..విదేశీ ఐపీ అడ్రెస్ నుంచి మెయిల్స్..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
సమంత ఫొటోపై చర్చ.. ఆగ్రహం వ్యక్తం చేస్తోన్న అభిమానులు
-
దిల్లీ మద్యం కేసు.. కవితకు మళ్లీ చుక్కెదురు