Talasani Srinivas yadav: సెప్టెంబరు 2 నుంచి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ: తలసాని శ్రీనివాస్యాదవ్
సెప్టెంబరు 2వ తేదీ నుంచి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పరిధిలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీకి శ్రీకారం చుట్టనున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.
హైదరాబాద్: సెప్టెంబరు 2వ తేదీ నుంచి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పరిధిలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీకి శ్రీకారం చుట్టనున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. జీహెచ్ఎంసీ పరిధిలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీపై అధికారులతో మంత్రి సమీక్షించారు. జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రోస్, జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, ఇతర అధికారులు పాల్గొన్నారు. అర్హులైన పేద కుటుంబాలకు పంపిణీ చేయనున్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం, అందంగా తీర్చిదిద్దడం, పంపిణీ కోసం చేయాల్సిన ఏర్పాట్లపై విస్తృతంగా చర్చించారు.
మొదటి విడతలో 8 ప్రాంతాల్లో 12వేల మంది అర్హులకు ఇళ్లను పంపిణీ చేయబోతున్నామని తలసాని ప్రకటించారు. అందుకోసం ఈ నెల 24వ తేదీన హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్లో డ్రా పద్ధతిలో లబ్ధిదారులను ఎంపిక చేయనున్నట్లు చెప్పారు. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న పేద కుటుంబాలు గొప్పగా ఆత్మగౌరవంతో బతకాలనేదే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యం అని తెలిపారు. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఒక్క తెలంగాణలోనే సకల మౌలిక సౌకర్యాలతో కూడిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ప్రభుత్వం నిర్మించి ఉచితంగా అందజేస్తోందని తలసాని వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోలీసుల అదుపులో భారాస నేత క్రిశాంక్
ఉస్మానియా విశ్వవిద్యాలయం మెస్ల మూసివేతపై దుష్ప్రచారం చేసిన కేసులో భారాస నేత క్రిశాంక్, ఓయూ విద్యార్థి నాగేందర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
శంషాబాద్లో 5 మేకలతో ఎర.. అయినా చిక్కని చిరుత
ఇటీవల శంషాబాద్ ఎయిర్పోర్టు పరిసరాల్లోకి వచ్చిన చిరుతను బంధించేందుకు అటవీశాఖ అధికారుల ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (01/05/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
డ్రై ఐస్ తిని మూడేళ్ల బాలుడు మృతి
-
ప్రపంచకప్కి రింకూని విస్మరించడమా? ఇదో చెత్త సెలక్షన్!
-
పోలీసుల అదుపులో భారాస నేత క్రిశాంక్
-
మద్యం మత్తులో పైలట్.. విమానాన్ని నిలిపివేసిన ఎయిర్ లైన్స్
-
వరల్డ్ కప్ జట్టులోకి ఎంట్రీ.. సంజూ శాంసన్ ‘మలయాళం’ ట్వీట్ వైరల్
-
సల్మాన్ఖాన్ ఇంటి వద్ద కాల్పుల ఘటన.. కస్టడీలో నిందితుడి ఆత్మహత్య