Ukraine crisis: విదేశాంగ మంత్రి జైశంకర్‌కు చంద్రబాబు ఫోన్‌

విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్‌తో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఫోన్‌లో మాట్లాడారు. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన 4 వేల మందికి పైగా తెలుగు విద్యార్థులను స్వదేశానికి తరలించాలని కేంద్ర మంత్రిని...

Published : 26 Feb 2022 01:26 IST

అమరావతి: విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్‌తో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఫోన్‌లో మాట్లాడారు. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన 4 వేల మందికి పైగా తెలుగు విద్యార్థులను స్వదేశానికి తరలించాలని కేంద్ర మంత్రిని చంద్రబాబు కోరారు. యుద్ధం కారణంగా అక్కడి తెలుగు విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కేంద్ర మంత్రికి వివరించారు. ఉక్రెయిన్‌లో చిక్కుకు పోయిన విద్యార్థులతో ఈ రోజు జూమ్ ద్వారా మాట్లాడిన విషయాన్ని.. వారి కష్టాలను జైశంకర్ దృష్టికి తీసుకెళ్లారు. తెలుగు విద్యార్థులను తరలించే బాధ్యత తాను తీసుకుంటానని కేంద్ర మంత్రి హామీ ఇచ్చినట్లు చెప్పారు. బాధిత విద్యార్థుల వివరాలను తన కార్యాలయంతో పంచుకోవాలని సూచించినట్లు పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని