TS News: చావడానికైనా అనుమతించండి.. దిల్లీలో భద్రాద్రి యువకుడి నిరసన!

ప్రభుత్వం న్యాయం చేయకపోయినా పర్వాలేదు గానీ.. చనిపోయేందుకైనా అనుమతివ్వాలంటూ తెలంగాణ యువకుడు దిల్లీలో నిరసనకు దిగాడు. భద్రాద్రి జిల్లా......

Published : 07 Dec 2021 21:26 IST

దిల్లీ: ప్రభుత్వం న్యాయం చేయకపోయినా పర్వాలేదు గానీ.. చనిపోయేందుకైనా అనుమతివ్వాలంటూ తెలంగాణ యువకుడు దిల్లీలో నిరసనకు దిగాడు. భద్రాద్రి జిల్లా ఇల్లందులో ఉపరితల గని కోసం భూములు కోల్పోయిన తమకు ప్రభుత్వం న్యాయం చేయాలంటూ సుందర్ అనే రైతు కుటుంబం కొంతకాలంగా పోరాడుతోంది. న్యాయం కోసం కొన్నాళ్లుగా సుందర్ కుటుంబం నిరసనలు కొనసాగిస్తోంది. ప్రజాప్రతినిధులు, అధికారులకు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా న్యాయం జరగలేదని వారు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీని కలిసి తమ సమస్య తెలియజేస్తానంటూ సుందర్‌ కుమారుడు సంజయ్‌ బైక్‌పైనే ప్రయాణించి దిల్లీకి చేరుకున్నాడు. సింగరేణి సంస్థ తీరును నిరసిస్తూ జంతర్ మంతర్ వద్ద నిరసనకు దిగాడు. తనకు న్యాయం చేయకపోయినా పర్వాలేదు గానీ.. చనిపోయేందుకైనా అనుమతివ్వాలంటూ ప్లకార్డును ప్రదర్శిస్తూ నిరసన వ్యక్తంచేశాడు.

Read latest General News and Telugu News


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని