ఐపీఎల్.. మళ్లీ భారమేనా?
ఐపీఎల్, అంతర్జాతీయ క్రికెట్లో తీరిక లేకుండా మ్యాచ్లు ఆడడం.. ఆ వెంటనే టీ20 ప్రపంచకప్ వేటకు వెళ్లడం.. అలసటకు గురైన ఆటగాళ్లు అక్కడ అంతంతమాత్రంగా ఆడడం.. టీమ్ఇండియా పోరాటం మధ్యలోనే ముగిసిపోవడం.. గత కొన్ని పర్యాయాల నుంచి ఇదే వరస!
ఈనాడు క్రీడావిభాగం
ఐపీఎల్, అంతర్జాతీయ క్రికెట్లో తీరిక లేకుండా మ్యాచ్లు ఆడడం.. ఆ వెంటనే టీ20 ప్రపంచకప్ వేటకు వెళ్లడం.. అలసటకు గురైన ఆటగాళ్లు అక్కడ అంతంతమాత్రంగా ఆడడం.. టీమ్ఇండియా పోరాటం మధ్యలోనే ముగిసిపోవడం.. గత కొన్ని పర్యాయాల నుంచి ఇదే వరస!
ఈసారి కూడా ఇదే కథ పునరావృతం అవుతుందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పలువురు భారత ఆటగాళ్లు ఫిట్నెస్ సమస్యల నుంచి కోలుకుని సున్నితమైన స్థితిలో ఐపీఎల్లో అడుగు పెట్టారు. విరామం లేకుండా మ్యాచ్లు ఆడేస్తున్నారు. విదేశీ ఆటగాళ్లు మాత్రం ప్రపంచకప్కు ప్రాధాన్యమిస్తూ ఐపీఎల్కు దూరమవుతుంటే.. మన వాళ్లు అప్రాధాన్య మ్యాచ్ల్లోనూ కొనసాగుతూ భారం పెంచుకుంటుండడం ఆందోళన రేకెత్తిస్తోంది.
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమివ్వనున్న టీ20 ప్రపంచకప్ జూన్ 2న ఆరంభం కాబోతోంది. అంతకు కేవలం వారం ముందే ఐపీఎల్ ముగియనుంది. ఐపీఎల్లో ఎంత ఒత్తిడి ఉంటుందో తెలిసిందే. పెద్దగా విరామం, విశ్రాంతి లేకుండా 50 రోజుల పాటు మ్యాచ్లు ఆడితే ఆటగాళ్లు ఎంతో అలసటకు గురవుతారు. మిగతా సందర్భాల్లో అయితే సరే కానీ.. ఈసారి ఐపీఎల్ అవ్వగానే పొట్టి కప్పు మొదలు కానున్న నేపథ్యంలో ఆటగాళ్లకు చాలినంత విశ్రాంతి అవసరం. కానీ ఐపీఎల్లో భారత స్టార్లు ఎవ్వరికీ విశ్రాంతి అన్న మాటే లేదు. వరుసగా మ్యాచ్లు ఆడేస్తున్నారు. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా జట్లకు చెందిన ఆటగాళ్లు ఐపీఎల్ చివరి దశలో అందుబాటులో ఉండట్లేదు. ఇంగ్లాండ్ జట్టులోని బట్లర్, బెయిర్స్టో, ఫిల్సాల్ట్, సామ్ కరన్, మొయిన్ అలీ, లివింగ్స్టన్ ప్లేఆఫ్స్కు ముందే ఐపీఎల్ వీడనున్నారు. ఆస్ట్రేలియా ఆటగాళ్లు మాక్స్వెల్, వార్నర్లకు ఐపీఎల్లో తగినంత విశ్రాంతి లభిస్తోంది. మిగతా దేశాల ఆటగాళ్లలో కొందరు ముందే ఐపీఎల్కు దూరమయ్యారు. భారత ఆటగాళ్లకు అలాంటి అవకాశమే లేదు. పోనీ ముందే వారిని లీగ్లో రొటేట్ చేస్తూ అలసటకు గురి కాకుండా చూస్తున్నారా అంటే అదీ లేదు. ఇది టీ20 ప్రపంచకప్లో ఆటగాళ్ల ప్రదర్శనపై ప్రభావం చూపుతుందనే ఆందోళన రేకెత్తిస్తోంది.
బుమ్రా.. భద్రమా?
టీ20 ప్రపంచకప్లో బుమ్రా ఎంత కీలకమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అతను దూరం కావడం 2022 పొట్టి కప్పులో భారత్ అవకాశాలపై తీవ్ర ప్రభావమే చూపింది. చాన్నాళ్లుగా టీ20లు ఆడని షమి, భువనేశ్వర్లను జట్టులోకి ఎంపిక చేయాల్సి వచ్చింది. బుమ్రా శరీరం ఎంత సున్నితమో ఇంతకుముందే చూశాం. ఈ నేపథ్యంలో ఈసారి అతణ్ని ప్రపంచకప్ ముంగిట జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ ముంబయికి ప్లేఆఫ్స్ అవకాశాలు లేకపోయినా అతణ్ని తుది జట్టులో కొనసాగిస్తున్నారు. బుమ్రాకు విశ్రాంతినివ్వడంపై అసలు చర్చే జరగలేదని ముంబయి బ్యాటింగ్ కోచ్ పొలార్డ్ చెప్పడం గమనార్హం. ఇక ముంబయికి సారథ్యం వహిస్తున్న హార్దిక్ పాండ్య కూడా చాన్నాళ్ల పాటు ఫిట్నెస్ సమస్యలతో ఇబ్బంది పడ్డాడు. ముంబయి కెప్టెన్సీ మార్పు తాలూకు వివాదంతో అతను సతమతం అయ్యాడు. కానీ వరుసగా మ్యాచ్లు ఆడుతున్నాడు. ఫిట్నెస్పై సందేహాలున్నప్పటికీ బౌలింగ్ చేస్తున్నాడు. ఇదే జట్టులో రోహిత్ శర్మ కూడా వరుసగా మ్యాచ్లు ఆడేస్తున్నాడు. సూర్యకుమార్ యాదవ్ సైతం కొన్ని నెలల పాటు మైదానానికి దూరంగా ఉండి ఐపీఎల్కు ఆలస్యంగా అందుబాటులోకి వచ్చాడు. ఆ తర్వాత విరామం లేకుండా మ్యాచ్లు ఆడుతున్నాడు. ప్రపంచకప్ ఆడబోయే మిగతా ఆటగాళ్లు కూడా ఐపీఎల్లో చివరి వరకు కొనసాగబోతున్నారు. మరి వీళ్లంతా తీవ్ర ఒత్తిడితో కూడిన ఐపీఎల్లో వరుసగా మ్యాచ్లు ఆడుతూ.. రోజూ ప్రయాణాలు చేస్తూ తీవ్ర అలసటకు గురయ్యాక.. వారం తిరక్కుండానే వెస్టిండీస్-అమెరికాకు వెళ్లి పొట్టి కప్పులో పూర్తి స్థాయి ప్రదర్శన చేయగలరా అన్నది ప్రశ్న.
‘‘బుమ్రాకు విశ్రాంతినిచ్చే విషయమై ఎలాంటి చర్చ జరగలేదు. ఏం జరుగుతుందో చూద్దాం. ఆటగాళ్లు ఐపీఎల్ పూర్తిగా ఆడేందుకే ఇక్కడికి వచ్చారు. కొన్నిసార్లు చాలా ముందుకు వెళ్లి ప్రపంచకప్ లాంటి టోర్నీల గురించి ఆలోచిస్తాం. ముందు ఐపీఎల్ పూర్తి కానివ్వండి. తర్వాత బుమ్రా భారత జట్టులోకి వెళ్తాడు. అక్కడ తన విశ్రాంతి గురించి ఆలోచిస్తారు’’
పొలార్డ్, ముంబయి బ్యాటింగ్ కోచ్
‘‘ఈ ఐపీఎల్లో రోహిత్ శర్మ తన ప్రదర్శనల పట్ల నిరాశ చెంది ఉంటాడు. సీజన్ను అతను బాగానే ఆరంభించాడు. కానీ తర్వాత గాడి తప్పాడు. బహుశా అలసట అతడిపై ప్రభావం చూపుతుండొచ్చు. ఒక విరామం అతడికి చాలా మేలు చేయొచ్చు. అప్పుడు కచ్చితంగా ఫామ్లోకి వస్తాడు’’
మైకేల్ క్లార్క్, ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజస్థాన్, కోల్కతా మ్యాచ్కు వరుణుడి ఆటంకం.. మ్యాచ్ రద్దయితే హైదరాబాద్కు లాభం..
ఐపీఎల్ 17వ సీజన్లో రాజస్థాన్, కోల్కతా మధ్య జరగాల్సిన చివరి లీగ్ మ్యాచ్కు వరుణుడు ఆటంకం కలిగిస్తున్నాడు. -
ఆఖరి లీగ్ మ్యాచ్లోనూ అదే జోరు.. పంజాబ్పై సన్రైజర్స్ ఘన విజయం
చివరి లీగ్ మ్యాచ్లో హైదరాబాద్ అదరగొట్టింది. పంజాబ్పై ఘన విజయాన్ని నమోదు చేసింది. -
దాన్ని రికార్డు చేయొద్దని కోరినా.. ప్రసారం చేశారు: రోహిత్ మండిపాటు
స్టార్ స్పోర్ట్స్పై రోహిత్ శర్మ అసంతృప్తి వ్యక్తం చేశాడు. మైదానంలో ఆటగాళ్ల సంభాషణలు రికార్డు చేయడంపై మండిపడ్డాడు. -
ధోనీ కొట్టిన ఆ భారీ సిక్సే ఆర్సీబీని గెలిపించిందా..?
ధోనీ ఒంటి చేత్తో సిక్స్లు కొట్టి మ్యాచ్లను ఎన్నోసార్లు గెలిపించాడు. అయితే.. ఆర్సీబీతో కీలకమైన మ్యాచ్లో అతడు కొట్టిన ఓ భారీ సిక్సే ఆ జట్టు ఓటమికి దారి తీసిందంటూ పలువురు విశ్లేషిస్తున్నారు. -
ఆర్సీబీ ఇంపాక్ట్ ప్లేయర్గా క్రిస్గేల్: జెర్సీ ఇంకా ఫిట్గానే ఉందన్న యూనివర్స్ బాస్
ఆర్సీబీకి అవసరమైతే ఇంపాక్ట్ ప్లేయర్గా బరిలోకి దిగేందుకు సిద్ధమే అంటూ క్రిస్గేల్ పేర్కొన్నాడు. తాను ఎప్పటికీ ఈ జట్టు ఫ్యాన్నే అని వెల్లడించాడు. -
అప్పుడు.. ఒక్కసారి కూడా స్కోరు బోర్డు చూడలేదు: యశ్ దయాళ్
ధోనీ, రవీంద్ర జడేజా వంటి హిట్టర్లు క్రీజ్లో ఉన్నా సరే.. కేవలం 18 పరుగులను కాపాడిన యశ్ దయాళ్ జట్టుకు అపూర్వ విజయం అందించాడు. బెంగళూరు ప్లేఆఫ్స్కు చేరుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. -
ధోనీకి ఎప్పుడేం చేయాలో తెలుసు: చెన్నై కోచ్
‘కెప్టెన్ కూల్’ ఎంఎస్ ధోనీ (MS Dhoni) ఈ సీజన్లో హిట్టింగ్ చేస్తూ సిక్స్లు, ఫోర్లు బాదేశాడు. మ్యాచ్ ఫలితంతో సంబంధం లేకుండా ధోనీ ఆట కోసమే అభిమానులు స్టేడియాలకు హోరెత్తారు. -
లీగ్ స్టేజ్లో చివరి రోజు.. ‘నంబర్ 2’ ఎవరిది..?
ఇప్పుడు ప్లేఆఫ్స్ బెర్తుల ఆట లేదు. కానీ, ఇవాళ తలపడనున్న నాలుగు జట్లలో రెండింటికి ఈ మ్యాచ్లు అత్యంత కీలకం. -
మలుపు తిప్పిన రనౌట్.. డుప్లీ సూపర్ క్యాచ్.. యశ్ లాస్ట్ ఓవర్ వీడియోలు వైరల్!
చివరి ఏడు మ్యాచుల్లో ఆరు గెలిచి.. ప్లేఆఫ్స్కు అర్హత సాధిస్తుందని ఎవరూ ఊహించలేదు. కానీ, బెంగళూరు ఆ ఫీట్ను సాధించింది. -
గతేడాది ‘ఫైనల్’ ఓవర్ పునరావృతం అవుతుందనుకున్నా: రుతురాజ్ గైక్వాడ్
ఐదుసార్లు విజేతగా నిలిచిన చెన్నై ఈసారి ప్లేఆఫ్స్కు చేరుకోవడంలో విఫలమైంది. ఆర్సీబీతో జరిగిన కీలక పోరులో ఓటమిపాలైంది. -
ధోనీని ఔట్ చేయడమే టర్నింగ్ పాయింట్.. యశ్కే ఈ అవార్డు: డుప్లెసిస్
ప్లేఆఫ్స్కు చేరుకుంటామనే ఆశలు అత్యంత తక్కువగా ఉన్నప్పటికీ.. వరుణుడి భయం వెన్నాడినా.. అవన్నీ దాటుకొని నాకౌట్ బెర్తును బెంగళూరు ఖరారు చేసుకుంది. -
విరాట్ కోహ్లీ.. తొలి భారత క్రికెటర్గా ఐపీఎల్లో సరికొత్త రికార్డు
కొద్దిపాటి అవకాశాలను సద్వినియోగం చేసుకుని బెంగళూరు ప్లేఆఫ్స్కు చేరుకుని అందర్నీ ఆశ్చర్యపరిచింది. మరోసారి విరాట్ కోహ్లీ కీలక పాత్ర పోషించాడు. -
భళి భళిరా బెంగళూరు
ఎనిమిది మ్యాచ్ల్లో ఒకే ఒక్క గెలుపు. పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానం. రన్రేటూ మైనసుల్లో. అప్పటికి కనీసం నాలుగు విజయాలు సాధించిన జట్లు ఆరున్నాయి. ఇక ఈ ఐపీఎల్లో బెంగళూరు కథ ముగిసినట్లేనని క్రికెట్ ప్రపంచం తీర్మానించింది. -
ఎవరికీ నిరూపించుకోవాల్సిన అవసరం లేదు: విరాట్
తాను ఎవరికీ నిరూపించుకోవాల్సిన అవసరం లేదని.. తన ప్రదర్శనే ప్రామాణికమని స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి అన్నాడు. ఐపీఎల్లో అత్యధిక పరుగుల జాబితాలో అగ్రస్థానంలో ఉన్నా.. అతడి స్ట్రైక్రేట్పై విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఇలా స్పందించాడు. -
రోహిత్ దారెటు?
ముంబయి ఇండియన్స్తో రోహిత్ ఇన్నింగ్స్ ముగిసినట్లేనా! వచ్చే సీజన్కు అతడు ఆ జట్టుతో ఉండడా? హిట్మ్యాన్ను కెప్టెన్సీ నుంచి తప్పించడంతో ఈ ఊహాగానాలకు తెరలేస్తే.. తాజాగా ముంబయి కోచ్ బౌచర్ వ్యాఖ్యలతో అవి కేవలం ఊహాగానాలే కావని తేలిపోయింది. -
25న న్యూయార్క్కు భారత క్రికెటర్లు
సహాయ సిబ్బందితో పాటు భారత జట్టులోని చాలా మంది ఆటగాళ్లు టీ20 ప్రపంచకప్ కోసం ఈ నెల 25న న్యూయార్క్ బయల్దేరనున్నారు. మిగతా ఆటగాళ్లు ఐపీఎల్ ఫైనల్ (మే 26) తర్వాత వెళ్తారు. -
నా బ్యాటింగ్ అంత గొప్పగా లేదు: రోహిత్
ప్రస్తుత ఐపీఎల్లో తన బ్యాటింగ్ ఆశించిన ప్రమాణాల మేర లేదని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. కానీ దాని గురించి అతిగా ఆలోచించాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డాడు. -
రెండో స్థానంలో అర్జున్
తెలంగాణ గ్రాండ్మాస్టర్ అర్జున్ ఇరిగేశి షార్జా మాస్టర్స్ చెస్ టోర్నమెంట్లో మెరుగైన ప్రదర్శన చేస్తున్నాడు. అతడు మరో విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు. శనివారం నాలుగో రౌండ్లో మాన్యుయెల్ పెట్రోసియన్ (ఆర్మేనియా)పై అతడు నెగ్గాడు. -
సిఫ్త్కౌర్, నీరజ్ గెలుపు
ఒలింపిక్ షూటింగ్ సెలక్షన్ ట్రయల్-4లో సిఫ్త్కౌర్, నీరజ్ కుమార్ విజేతలుగా నిలిచారు. మహిళల 50 మీటర్ల రైఫిల్ త్రీపొజిషన్స్ తుది పోరులో సిఫ్త్ 461.3 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. -
పర్వీన్ స్థానంలో జైస్మిన్
బాక్సర్ పర్వీన్ హుడాపై ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) నిషేధం విధించిన నేపథ్యంలో.. కోల్పోయిన ఒలింపిక్ బెర్తు తిరిగి దక్కించుకునే ప్రయత్నాన్ని భారత బాక్సింగ్ సమాఖ్య ఆరంభించింది. -
తుదిపోరుకు సాత్విక్ ద్వయం
థాయ్లాండ్ బ్యాడ్మింటన్ ఓపెన్లో సాత్విక్ సాయిరాజ్-చిరాగ్శెట్టి జోడీ అదిరే ప్రదర్శన చేస్తోంది. దూకుడైన ఆటతో ఈ భారత జంట ఫైనల్కు దూసుకెళ్లింది. శనివారం పురుషుల డబుల్స్ సెమీస్లో సాత్విక్ ద్వయం 21-11, 21-12తో లూ మింగ్-తాంగ్ కైయ్ వీయ్ (చైనీస్ తైపీ) జోడీని చిత్తు చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
‘భారతీయుడు 2’ రిలీజ్ డేట్ ఫిక్స్.. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ లుక్తో అజిత్
-
పీర్జాదిగూడ మేయర్, కార్పొరేటర్ల కిడ్నాప్నకు కాంగ్రెస్ యత్నం: హరీశ్రావు
-
కిల్లర్ టైగర్ కోసం 150 కెమెరాలతో నిఘా.. 36 గ్రామాల్లో రెడ్ అలర్ట్!
-
బహిరంగ సభ మధ్యలోనే వెనుదిరిగిన రాహుల్.. కారణమిదే..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
నిలిచిపోయిన కాగజ్నగర్, నవజీవన్ ఎక్స్ప్రెస్ రైళ్లు .. ప్రయాణికుల ఆందోళన