China: ఆ గ్రామంలో సగం మంది మరుగుజ్జులే..!
చైనాలోని యాంగ్జి గ్రామ ప్రజలు వింత పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. అక్కడి జనాభాలో దాదాపు 50 శాతం మంది మరగుజ్జులేనట.
వారి సమస్య ఇప్పటికీ అంతుపట్టని రహస్యమే
బీజింగ్: చైనాలోని యాంగ్జి గ్రామ ప్రజలు వింత పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. అక్కడి జనాభాలో దాదాపు 50 శాతం మంది మరుగుజ్జులేనట. ఆ గ్రామంలో పుట్టి పెరిగిన 80 మందిలో 40 మంది దేశ సగటు ఎత్తు ఎదగలేదని ఓ నివేదిక వెల్లడించింది. పొడవైన వ్యక్తి 3 అడుగుల 10 అంగుళాలు ఉండగా, పొట్టిగా ఉన్న వ్యక్తి ఎత్తు 2 అడుగుల ఒక అంగుళం మాత్రమే. వారంతా పొట్టివాళ్లుగా మారడం వెనక గల కారణమేంటని శాస్త్రవేత్తలు ఎన్నో అంశాలను పరిశీలించారు. వారు పీల్చే గాలి, నీరు, ఆహారం, నేల తీరు అన్నింటిని పరీక్షించారు. అయినా అసలు గుట్టును మాత్రం కనిపెట్టలేకపోయారు.
అయితే దీనిపై యాంగ్జి ప్రజలను పలకరిస్తే ఒక్కొక్కరు ఒక్కో కారణం చెప్తారు. ఒకసారి వేసవి కాలంలో రాత్రి సమయంలో 5 నుంచి 7 సంవత్సరాల వయస్సున్న పిల్లలకు అంతుపట్టని వ్యాధి సోకిందని, ఆ పిల్లల్లో ఎదుగుదల లోపించిందని ఒకరు వెల్లడించారు. వారితో పాటు మరికొందరు ఇతర శారీరక లోపాలతో బాధపడుతున్నారన్నారు. 1997 నాటికి అక్కడి నేలలో అధిక స్థాయిలో పాదరసం ఉండటమే ఎదుగుదల లోపానికి కారణమని మరొకరన్నారు. అయితే దానికి తగ్గ శాస్త్రీయ ఆధారం మాత్రం లభించలేదని పరిశోధకులు వెల్లడించారు. జపాన్ నుంచి వచ్చిన విషవాయువు కావొచ్చని భావిస్తున్నవారు లేకపోలేదు. దీనికి కూడా ఆధారం దొరకలేదు. ఇదిలా ఉండగా.. తన భూభాగం అయిన యాంగ్జి గ్రామంలోకి చైనా ప్రభుత్వం విదేశీ పర్యాటకుల్ని మాత్రం అనుమతించదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
టీఎస్బీపాస్తోనే అనుమతులు.. డీపీఎంఎస్ విధానం పూర్తిగా నిలుపుదల
-
కొండయ్య.. లెక్కే వేరు
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
-
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి
-
‘యూటీఎస్’ పరిధి పెంపు.. ఇక ఎంత దూరం నుంచైనా జనరల్ టికెట్ కొనచ్చు..
-
చిరంజీవిని విమర్శిస్తే ఖబడ్దార్.. వైకాపాకు సీఎం రమేశ్ హెచ్చరిక