
Updated : 25 Dec 2021 14:53 IST
AP News: క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ
విజయవాడ: విజయవాడలోని నొవాటెల్ హోటల్లో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో సీజేఐ జస్టిస్ ఎన్వీరమణ పాల్గొన్నారు. హోటల్కు చేరుకున్న బిషప్లు, క్రైస్తవ మతపెద్దలు క్రిస్మస్ సందర్భంగా సీజేఐతో కేక్ కట్ చేయించారు. బిషప్లకు జస్టిస్ ఎన్వీరమణ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతూ కేక్ తినిపించారు. వేడుకల్లో ఏపీ, తెలంగాణ హైకోర్టు సీజేలు, జడ్జిలు, తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మరోవైపు నొవాటెల్ హోటల్లో ఉన్న సీజేఐని కలిసేందుకు ప్రముఖులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు.
Tags :