AP News: క్రిస్మస్‌ వేడుకల్లో పాల్గొన్న సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ

విజయవాడలోని నొవాటెల్‌ హోటల్‌లో నిర్వహించిన క్రిస్మస్‌ వేడుకల్లో సీజేఐ జస్టిస్‌ ఎన్వీరమణ పాల్గొన్నారు.

Updated : 25 Dec 2021 14:53 IST

విజయవాడ: విజయవాడలోని నొవాటెల్‌ హోటల్‌లో నిర్వహించిన క్రిస్మస్‌ వేడుకల్లో సీజేఐ జస్టిస్‌ ఎన్వీరమణ పాల్గొన్నారు. హోటల్‌కు చేరుకున్న బిషప్‌లు, క్రైస్తవ మతపెద్దలు క్రిస్మస్‌ సందర్భంగా సీజేఐతో కేక్ కట్‌ చేయించారు. బిషప్‌లకు జస్టిస్‌ ఎన్వీరమణ క్రిస్మస్‌ శుభాకాంక్షలు తెలుపుతూ కేక్‌ తినిపించారు. వేడుకల్లో ఏపీ, తెలంగాణ హైకోర్టు సీజేలు, జడ్జిలు, తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మరోవైపు నొవాటెల్‌ హోటల్‌లో ఉన్న సీజేఐని కలిసేందుకు ప్రముఖులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని