CM Jagan: బోర్డుపై ‘ఆల్‌ ద వెరీ బెస్ట్‌’ అని రాసిన సీఎం జగన్‌ 

తూర్పుగోదావరి జిల్లాలో ఏపీ సీఎం జగన్‌ పర్యటన కొనసాగుతోంది.

Updated : 16 Aug 2021 16:02 IST

పి.గన్నవరం: తూర్పుగోదావరి జిల్లాలో ఏపీ సీఎం జగన్‌ పర్యటన కొనసాగుతోంది. పర్యటనలో భాగంగా పి.గన్నవరంలో భవిత కేంద్రాన్ని సీఎం సందర్శించారు. మానసిక స్థితి సరిగా లేని చిన్నారుల తల్లిదండ్రులతో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా విద్యార్థులతో పాటు తరగతి గదిలో బెంచ్‌పై జగన్‌ కూర్చొన్నారు. బడుల ప్రారంభం సందర్భంగా తరగతి గదిలో బోర్డుపై ‘ఆల్‌ ద వెరీ బెస్ట్‌’ అని సీఎం రాశారు. అనంతరం పి.గన్నవరం జడ్పీ పాఠశాలలో తరగతి గదులను ఆయన పరిశీలించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు