Hyderabad: స్పర్శ్ హాస్పిస్ను ప్రారంభించిన కేటీఆర్
జీవిత చరమాంకంలో ఉన్నవారికి ఉచిత వైద్యసేవలు అందించడానికి హైదరాబాద్లోని ఖాజాగూడ
హైదరాబాద్: జీవిత చరమాంకంలో ఉన్నవారికి ఉచిత వైద్యసేవలు అందించడానికి హైదరాబాద్లోని ఖాజాగూడ వద్ద ఎకరా విస్తీర్ణంలో నిర్మించిన స్పర్శ్ హాస్పిస్ కొత్త భవనాన్ని మంత్రి కేటీఆర్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
‘స్పర్శ్ హాస్పిస్ నుంచి ఆహ్వానం వచ్చే వరకు పాలియేటివ్ కేర్ అంటే ఏంటో నాకు తెలియదు. దీని గురించి స్వయంగా తెలుసుకుంటే గొప్పగా అనిపించింది. స్పర్శ్ హాస్పిస్ వేలాది మందికి సాంత్వన కలిగిస్తుంది. ఐదేళ్లలోనే స్పర్శ్ హాస్పిస్కు మంచి భవనం రావడం సంతోషకరం. అధునాతన భవనంలో పూర్తి వసతులతో 82 పడకలు ఏర్పాటు చేశారు. చిన్నారుల కోసం ప్రత్యేకంగా 10 పడకలను అందుబాటులోకి తీసుకొచ్చారు. స్పర్శ్ హాస్పిస్లో డాక్టర్లు, 30 మందికి పైగా నర్సింగ్ సిబ్బంది సేవలు అందిస్తారు. ఏపీతో పాటు ఒడిశా, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, కర్ణాటక నుంచి రోగులు ఇక్కడికి వచ్చి చికిత్స పొందుతున్నారు. స్పర్శ్ హాస్పిస్కు నీటి, విద్యుత్, ఆస్తిపన్ను రద్దు చేస్తాం. ప్రభుత్వ ఆధ్వర్యంలో పాలియేటివ్ సేవలు అందించాలని యోచిస్తున్నాం. ’ అని కేటీఆర్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో శాంతా బయోటెక్ వ్యవస్థాపకులు వరప్రసాద్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434
-
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం
-
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం