Ts News: తెలంగాణలో విద్యా సంస్థలకు సెలవులపై జీవో జారీ
తెలంగాణలోని అన్ని విద్యాసంస్థలకు ఈ నెల 8 నుంచి 16వ తేదీ వరకు సెలవులు ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించిన విషయం తెలిసిందే. గతంలో 11 నుంచి
హైదరాబాద్: తెలంగాణలోని అన్ని విద్యాసంస్థలకు ఈ నెల 8 నుంచి 16వ తేదీ వరకు సెలవులు ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించిన విషయం తెలిసిందే. గతంలో 11 నుంచి సంక్రాంతి సెలవులు ఇవ్వాలనుకున్నా.. రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసుల నేపథ్యంలో మూడు రోజుల ముందే సెలవులు ప్రకటిస్తూ సోమవారం సీఎం నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు సీఎం కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా మెడికల్ కళాశాలలు మినహా రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ సంస్థలకు సెలవులు ప్రకటిస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
దేశం, రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో వైద్య ఆరోగ్యశాఖపై సీఎం సోమవారం ప్రగతిభవన్లో ఉన్నతస్థాయి సమీక్షను నిర్వహించారు. ఒమిక్రాన్పై ప్రజలు భయాందోళన చెందనవసరం లేదని, నిరంతరం అప్రమత్తంగా ఉంటూ స్వీయ నియంత్రణ చర్యలు పాటించాలన్నారు. పనిచేసే చోట్ల అప్రమత్తత పాటిస్తూ మాస్క్లు ధరించాలని, నిబంధనలను విధిగా పాటించాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రభుత్వం కరోనాను ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉందన్నారు. కేసులు పెరుగుతున్నందున రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖానాల్లో మౌలిక వసతులన్నింటినీ పూర్తిస్థాయిలో మెరుగుపరచాలని.. పడకలు, ఆక్సిజన్, ఔషధాలు పరీక్ష కిట్లను అవసరం మేరకు సమకూర్చుకోవాలని ఆదేశించారు. అన్ని దవాఖానాల్లో వైద్యులంతా అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ఏ కారణం చేతనైనా ఖాళీలు ఏర్పడితే 15 రోజుల్లో భర్తీ చేసుకునేలా విధివిధానాలు రూపొందించాలన్నారు. హైదరాబాద్ తరహాలో అన్ని నగరపాలక సంస్థల్లో సామాన్యులకు నాణ్యమైన వైద్యసేవలు అందించేందుకు మరిన్ని బస్తీ దవాఖానాలను ఏర్పాటుచేయాలని సూచించారు.
‘‘పెరుగుతున్న జనాభా అవసరాల రీత్యా రాష్ట్రంలో డాక్టర్లు, పడకలు, ఇతర మౌలిక వసతులు పెరగాలి. నూతనంగా నిర్మించుకున్న సమీకృత కలెక్టర్ కార్యాలయాల్లోకి పలు శాఖల కార్యాలయాలు మారుతున్న దృష్ట్యా ఖాళీ అయిన పాత కలెక్టరేట్లను, శాఖల భవనాలను, స్థలాలను విద్యా, వైద్యశాఖకు బదలాయించాలి. ప్రభుత్వాసుపత్రుల్లో పడకల్లో దాదాపు 99 శాతానికి ఆక్సిజన్ సమకూరింది. మిగిలిన ఒక్క శాతానికి కూడా దాన్ని కల్పించాలి. రాష్ట్రంలో ఆక్సిజన్ 500 మెట్రిక్ టన్నులకు పెంచాలి. హోం ఐసొలేషన్ కిట్లను కోటికి పెంచాలి. పరీక్ష కిట్లను రెండు కోట్లకు పెంచాల’’ని సీఎం ఆదేశించారు.
సమీక్షలో భాగంగా రాష్ట్రంలోని పరిస్థితులను వైద్యారోగ్య శాఖ అధికారులు సీఎంకు నివేదించారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రస్తుతం రాష్ట్రంలో లాక్డౌన్ విధించే పరిస్థితులు లేవని తెలిపారు. రాష్ట్రంలో కరోనా ప్రబలే ప్రమాదం ఉన్నందున బహిరంగ సభలు, ర్యాలీలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ మాస్క్లు ధరించాలని, ప్రభుత్వ నిబంధనలను పాటించడం ద్వారా కరోనాను నియంత్రించవచ్చని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
-
టీఎస్బీపాస్తోనే అనుమతులు.. డీపీఎంఎస్ విధానం పూర్తిగా నిలుపుదల
-
కొండయ్య.. లెక్కే వేరు
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
-
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి
-
‘యూటీఎస్’ పరిధి పెంపు.. ఇక ఎంత దూరం నుంచైనా జనరల్ టికెట్ కొనచ్చు..