Polavaram: పోలవరం ప్రాజెక్టు నిధుల విడుదలపై స్పష్టత ఇచ్చిన కేంద్రం

పోలవరం ప్రాజెక్టు నిధుల విడుదలపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. రాష్ట్రం పంపిన తాజా ప్రతిపాదనను కేంద్రం ఆమోదించాల్సి ఉందని కేంద్రమంత్రి బిశ్వేశ్వర టుడు వెల్లడించారు.

Published : 27 Jul 2023 19:24 IST

దిల్లీ: పోలవరం ప్రాజెక్టు నిధుల విడుదలపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలు ఆమోదించాకే నిధుల విడుదల ఉంటుందని మచిలీపట్నం వైకాపా ఎంపీ వి.బాలశౌరి లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి  బిశ్వేశ్వర్‌ టుడు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ‘‘పోలవరం పనుల తీరుకు అనుగుణంగానే నిధులు విడుదల ఉంటుంది. జూన్‌ 5న రాష్ట్రం తాజా ప్రతిపాదన సమర్పించింది. 41.15 మీటర్ల మేర నీటి నిల్వకు ప్రతిపాదన సమర్పించింది. రూ.17,144 కోట్లతో రాష్ట్రం సవరించిన ప్రతిపాదన ఇచ్చింది. రాష్ట్రం పంపిన తాజా ప్రతిపాదనను కేంద్రం ఆమోదించాల్సి ఉంది’’ అని బిశ్వేశ్వర టుడు వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని