Amaravati: వైకాపా మాజీ నేత దండా నాగేంద్రకు 14 రోజుల రిమాండ్
తెలంగాణ మద్యం తరలింపు కేసులో అరెస్టయిన వైకాపా మాజీ నతే నాగేంద్రకు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.
అమరావతి: పల్నాడు జిల్లా అమరావతికి (Amaravati) చెందిన వైకాపా మాజీ నేత దండా నాగేంద్రను పోలీసులు కోర్టులో హాజరు పరిచారు. జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. రాష్ట్రంలో ఇసుక అక్రమ తవ్వకాలపై నాగేంద్ర జాతీయ హరిత ట్రైబ్యునల్లో ఇటీవల కేసు దాఖలు చేశారు. ఆయన వేసిన పిటిషన్ను విచారించిన తర్వాత ఇసుక తవ్వకాలు ఆపేయాలని జాతీయ హరిత ట్రైబ్యునల్ ఆదేశాలు జారీ చేసింది. ఆదేశాలు వచ్చిన కొద్ది రోజులకే నాగేంద్రపై ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదైంది. వైకాపా కార్యకర్త చేసిన ఫిర్యాదు మేరకు అమరావతి పోలీసులు నాగేంద్రపై కేసు నమోదు చేశారు. అయితే, ఈ కేసులో నాగేంద్ర బెయిల్ తెచ్చుకున్నారు. తాజాగా నాగేంద్రపై తెలంగాణ మద్యం తరలింపు కేసును బనాయించిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొని కోర్టులో హాజరు పరిచారు. కోర్టు వద్ద నాగేంద్రను మాజీమంత్రి నక్కా ఆనంద్బాబు పరామర్శించారు. ఆయన కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.
నాగేంద్ర గతంలో పెదకూరపాడు వైకాపా ఎమ్మెల్యే నంబూరి శంకర్రావుతో ఉండే వారు. హరిత ట్రైబ్యునల్లో కేసు దాఖలు తర్వాత శంకర్రావుకు నాగేంద్ర దూరమయ్యాడు. ఆ తర్వాత కేసులు పెట్టారు. అమరావతిలో నాగేంద్ర అతిథి గృహానికి నోటీసులు ఇచ్చారు. దీంతో కొంతకాలం నాగేంద్ర అజ్ఞాతంలోకి వెళ్లారు. ఇటీవలే బయటకు వచ్చిన నాగేంద్ర.. తెదేపా అధినేత చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఇసుక అక్రమ తవ్వకాలకు సంబంధించిన సమాచారాన్ని చంద్రబాబుకు అందించినట్టు ప్రభుత్వ పెద్దలకు తెలిసింది. దీంతో నాగేంద్రను పాత కేసులో అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. కొద్ది రోజుల క్రితం నాగేంద్రపై పీడీ యాక్టు ప్రయోగించేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్టు సమాచారం. అయితే, ఈ విషయం బయటకు రానీయలేదు. హరిత ట్రైబ్యునల్లో కేసు విషయంలో నాగేంద్రను ప్రోత్సహించిన కంచేటి సాయిని ఇప్పటికే పోలీసులు పీడీ యాక్టు కింద అరెస్టు చేసి రాజమహేంద్రవరం జైల్లో ఉంచారు. ఇప్పుడు నాగేంద్రను అరెస్టు చేయడం చూస్తుంటే.. ప్రభుత్వ పెద్దల ప్రమేయం ఉన్నట్టు అర్థమవుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (17/05/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు. -
‘గున్న ఏనుగుకు జెడ్ కేటగిరీ సెక్యూరిటీ’.. వీడియో వైరల్
Viral video: గున్న ఏనుగుకు కుటుంబమే జెడ్ క్లాస్ సెక్యూరిటీ కల్పిస్తున్న వీడియో నెట్టింట వైరల్గా మారింది.
తాజా వార్తలు (Latest News)
-
కిడ్నాప్ చేసి.. పొరుగింట్లోనే 26 ఏళ్లు బంధించి..!
-
‘వన్ చిప్ ఛాలెంజ్’ వల్లే బాలుడి మృతి.. ఇంతకీ ఏంటీ సవాల్?
-
వరల్డ్ కప్ జట్టులో హార్దిక్.. విమర్శలపై క్లారిటీ ఇచ్చిన జై షా
-
అటల్ సేతుపై రష్మిక వీడియో.. స్పందించిన మోదీ
-
అతడు నన్ను కాలితో తన్నాడు.. కడుపుపై కొట్టాడు: దాడి ఘటనపై స్వాతి మాలీవాల్
-
ఆ రూమర్స్కు చెక్ పెట్టిన నిర్మాణ సంస్థ.. ‘SSMB29’పై క్లారిటీ