Telangana News: కామారెడ్డి రోడ్డు ప్రమాద ఘటన.. పరిహారం ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

కామారెడ్డి జిల్లా హసన్‌పల్లి రోడ్డు ప్రమాద బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. మృతుల కుటుంబాలకు రూ.2లక్షలు, గాయపడిన వారికి రూ.50వేల సాయం అందిస్తామని మంత్రి ప్రశాంత్‌రెడ్డి ప్రకటించారు. మరోవైపు ప్రధాని మోదీ 

Updated : 09 May 2022 12:57 IST

హైదరాబాద్‌: కామారెడ్డి జిల్లా హసన్‌పల్లి రోడ్డు ప్రమాద బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. మృతుల కుటుంబాలకు రూ.2లక్షలు, గాయపడిన వారికి రూ.50వేల సాయం అందిస్తామని మంత్రి ప్రశాంత్‌రెడ్డి ప్రకటించారు. మరోవైపు ప్రధాని మోదీ ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేల పరిహారం ప్రకటించిన విషయం తెలిసిందే. నిన్న టాటా ఏస్‌ వాహనం.. ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టడంతో 9 మంది మృతి చెందగా.. పది మందికి పైగా గాయాలయ్యాయి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని