‘యప్ టీవీ’కి ఐపీఎల్ ప్రసార హక్కులు
ప్రపంచ వ్యాప్తంగా పేరెన్నికగన్న ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ఫం ‘యప్ టీవీ’ ఐపీఎల్ 2020 ప్రసార హక్కులను సొంతం చేసుకుంది. ఐపీఎల్ సీజన్ సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 10 వరకు మొత్తం 60 మ్యాచులను ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో స్టేడియం వెళ్లి మ్యాచ్లు చూసేందుకు..
ఇంటర్నెట్డెస్క్: ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ఫం ‘యప్ టీవీ’ ఐపీఎల్ 2020 ప్రసార హక్కులను సొంతం చేసుకుంది. ఐపీఎల్ సీజన్ సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 10 వరకు మొత్తం 60 మ్యాచులను ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో స్టేడియం వెళ్లి మ్యాచ్లు చూసేందుకు ఎవరూ అంతగా ఆసక్తి కనబర్చడం లేదు. దీంతో ఓటీటీ ప్లాట్ఫాంకు ప్రాధాన్యం ఏర్పడింది. ఇప్పటికే యప్ టీవీకి విశేష ఆదరణ లభిస్తుండగా.. ఐపీఎల్ 2020తో మరింత పెరుగుతుందని సంస్థ యాజమాన్యం భావిస్తోంది. ఆస్ట్రేలియా, యూరప్, మలేసియా, ఆగ్నేయ ఆసియా, శ్రీలంక, నేపాల్, భూటాన్, మాల్దీవులు, మధ్య ఆసియా, దక్షిణఅమెరికా తదితర చోట్ల డ్రీమ్ 11 ఐపీఎల్ 2020 మ్యాచ్లను యప్ టీవీ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది.
తాజా ఐపీఎల్ సీజన్తో యప్ టీవీ మరింత మందికి చేరువయ్యే అవకాశముందని సంస్థ వ్యవస్థాపకుడు, సీఈవో ఉదయ్రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ‘‘గత కొన్నేళ్లుగా ఐపీఎల్ను విశేషంగా ఆదరిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో తాజా ఐపీఎల్ కొంత సంచలనాలకు తావిస్తుంది. ఇన్నాళ్లు కిక్కిరిసిన స్టేడియంలో, ప్రేక్షకుల కేరింతల మధ్య మ్యాచ్లు సాగేవి. కానీ, కుటుంబ సభ్యుల మధ్య కూర్చునే అంతటి ఆనందాన్ని పొందేలా యప్ టీవీ మ్యాచ్లను ప్రత్యక్ష ప్రసారం చేయబోతోంది. దీంతో ప్రేక్షకుల అనుభూతి రెట్టింపవుతుంది.అంతేకాకుండా యప్ టీవీ సత్తాను నిరూపించుకునేందుకు ఈ ఐపీఎల్ మరింత దోహదం చేస్తుందని భావిస్తున్నాం’’ అని ఉదయ్రెడ్డి ఓ ప్రకటనలో వెల్లడించారు.
దశాబ్ద కాలంగా ప్రపంచ వ్యాప్తంగా భారతీయులకు సేవలందిస్తున్న ఈ సంస్థ.. 14 ప్రముఖ భారతీయ భాషల నుంచి దాదాపు 250కి పైగా టీవీ ఛానళ్లను, 3000లకు పైబడి సినిమాలను , వందకు పైగా టీవీ షోలను ప్రసారం చేస్తోంది. ప్రపంచ నెంబర్ ఓటీటీ ఫ్లాట్ఫాంగా ఎదిగింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏపీ నూతన డీజీపీగా హరీశ్కుమార్ గుప్తా
ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా 1992 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన హరీశ్కుమార్ గుప్తాను ఎన్నికల సంఘం నియమించింది. -
ఏపీ నూతన డీజీపీ కోసం ముగ్గురు పేర్లతో ఈసీకి సిఫార్సు
ఏపీ డీజీపీ కేవీ రాజేంద్రనాథ్పై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) బదిలీ వేటు వేసిన సంగతి తెలిసిందే. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
దిల్లీ మద్యం కేసు.. కవితకు మళ్లీ చుక్కెదురు
దిల్లీ మద్యం కేసులో భారాస ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మళ్లీ చుక్కెదురైంది. బెయిల్ ఇచ్చేందుకు రౌస్ అవెన్యూ కోర్టు నిరాకరించింది. -
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్.. నేను ప్రత్యక్ష బాధితుడిని: విశ్రాంత ఐఏఎస్ అధికారి పీవీ రమేశ్
వైకాపా ప్రభుత్వం తీసుకొచ్చిన ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్’పై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఓటేశాక.. వృద్ధులను వదిలేశారు..
ఎన్నికల ముందు ప్రతిపక్షనేత హోదాలో పాదయాత్ర చేసిన జగన్ ఎన్నో హామీలు గుప్పించారు. అన్ని వర్గాలను మాటలతో మెప్పించి.. అనంతరం నిండా ముంచారు. -
జిల్లాలో తేలికపాటి వర్షాలు
జిల్లాలోని రెండు ప్రాంతాల్లో తేలిక పాటి వర్షాలు కురిశాయి. శనివారం సాయంత్రం నుంచి ఆదివారం ఉదయం వరకు నమోదైన వివరాల ప్రకారం.. మొత్తం 5.2 మిల్లీ మీటర్ల వర్షం పడగా, సగటు వర్షపాతం 0.26 మి.మీ.గా ఉంది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (06/05/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
అణ్వాయుధాల కసరత్తు మొదలుపెట్టండి - సైన్యానికి పుతిన్ ఆదేశం
-
రోజంతా ఒడుదొడుకుల్లో.. చివరికి ఫ్లాట్గా ముగిసిన సూచీలు
-
‘నిన్ను చూసి గర్వపడుతున్నాం’ పూంచ్లో అమరుడైన సైనికుడి సోదరి ఆవేదన
-
రూ.15వేల జీతగాడి ఇంట్లో రూ.25 కోట్లు.. ఎవరీ మంత్రి అలంఘీర్ ..?
-
రహదారిపై గుంతలకు NHAI కొత్త టెక్నిక్.. వాటంతట అవే పూడుకునేలా.!
-
ఏపీ నూతన డీజీపీగా హరీశ్కుమార్ గుప్తా