Cyclone Asani: అసని ఎఫెక్ట్.. విశాఖ, విజయవాడ విమాన సర్వీసులు రద్దు
అసని తుపాను ప్రభావంతో విశాఖకు విమాన రాకపోకలు రెండో రోజైన ఇవాళ కూడా రద్దయ్యాయి. విశాఖ నుంచి అన్ని ఇండిగో సర్వీసులను రద్దు చేశారు.
విజయవాడ: అసని తుపాను ప్రభావంతో విశాఖకు విమాన రాకపోకలు రెండో రోజైన ఇవాళ కూడా రద్దయ్యాయి. విశాఖ నుంచి అన్ని ఇండిగో సర్వీసులను రద్దు చేశారు. మొత్తం 22 సర్వీసుల రాకపోకలను రద్దు చేస్తున్నట్లు ఇండిగో సంస్థ ప్రకటించింది. బెంగళూరు, దిల్లీ నుంచి రెండు విమాన సర్వీసులను ఎయిర్ ఏషియా రద్దు చేసింది. తుపాను దృష్ట్యా ఎయిరిండియా విమన సర్వీసులు కూడా రద్దు చేశారు. స్పైస్జెట్ విమాన సర్వీసులను ఈ ఉదయం రద్దు చేసినట్లు ఆ సంస్థ తెలిపింది. మధ్యాహ్నం తర్వాత హైదరాబాద్ సర్వీసుపై తర్వాత ప్రకటిస్తామని స్పైస్జెట్ ప్రకటించింది. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని విశాఖ ఎయిర్పోర్ట్ డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు.
మరోవైపు విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో పలు సర్వీసులను రద్దు చేశారు. బెంగళూరు, హైదరాబాద్, చెన్నై ప్రధాన సర్వీసులను రద్దు చేసినట్లు ఇండిగో ప్రకటించింది. దీంతో పాటు విశాఖ, రాజమహేంద్రవరం, కడపకు నడిచే లింకు సర్వీసును నిలుపుదల చేశారు. వాతావరణ మార్పుల అనంతరం సర్వీసును పునరుద్ధరిస్తామని ఇండిగో తెలిపింది. రాజమహేంద్రవరం విమానాశ్రయం నుంచి అన్ని విమాన సర్వీసులను రద్దు చేశారు. హైదరాబాద్, బెంగళూరు, విశాఖ నుంచి తొమ్మిది విమానాలు రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
వైకాపా వెన్నులో వణుకు.. చెమటలు పట్టిస్తున్న పూతలపట్టు కాంగ్రెస్ అభ్యర్థి
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
-
టీఎస్బీపాస్తోనే అనుమతులు.. డీపీఎంఎస్ విధానం పూర్తిగా నిలుపుదల
-
కొండయ్య.. లెక్కే వేరు
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
-
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి