Yadagirigutta: యాదగిరిగుట్టలో వైభవంగా తిరు కల్యాణ మహోత్సవం

యాదగిరిగుట్టలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి.

Updated : 18 Mar 2024 22:00 IST

భువనగిరి: యాదగిరిగుట్టలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఎనిమిదో రోజు స్వామివారి తిరు కల్యాణ మహోత్సవానికి భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. మంత్రోచ్ఛరణలు, మంగళవాయిద్యాల నడుమ వేడుక ఘనంగా జరిగింది. గజ వాహనంపై తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ కల్యాణ మండపానికి నరసింహ స్వామి, శ్రీ లక్ష్మి అమ్మవార్లు చేరుకున్నారు. ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ కమిషనర్ హన్మంతరావు పట్టు వస్త్రాలు సమర్పించారు. కార్యక్రమంలో మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారి నామస్మరణతో యాదగిరిగుట్ట మార్మోగుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని