భారత్లో 3కోట్ల కరోనా టెస్టులు..!
ఆగస్టు 16వరకు దేశంలో మొత్తం 3కోట్ల 41వేల (3,00,41,400) శాంపిళ్లకు కొవిడ్ టెస్టులు పూర్తిచేసినట్లు ఐసీఎంఆర్ పేర్కొంది.
నిన్న ఒక్కరోజే 7లక్షల 31వేల శాంపిళ్లకు పరీక్ష
దిల్లీ: దేశంలో కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతున్న నేపథ్యంలో కొవిడ్ నిర్ధారణ పరీక్షలను ఆయా ప్రభుత్వాలు ముమ్మరం చేశాయి. దేశవ్యాప్తంగా గత కొన్నిరోజులుగా నిత్యం దాదాపు 6నుంచి 8లక్షల శాంపిళ్లకు కొవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. తాజాగా నిన్న ఒక్కరోజే మరో 7లక్షల 31వేల శాంపిళ్లకు కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్) వెల్లడించింది. దీంతో ఆగస్టు 16వరకు దేశంలో మొత్తం 3కోట్ల 41వేల (3,00,41,400) శాంపిళ్లకు కొవిడ్ టెస్టులు పూర్తిచేసినట్లు ఐసీఎంఆర్ పేర్కొంది. ఆగస్టు 12వ తేదీన ఒక్కరోజే దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో 8లక్షల 30వేల పరీక్షలు నిర్వహించారు. మహారాష్ట్ర, ఉత్తర్ప్రదేశ్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కొవిడ్ టెస్టులు అధికంగా చేపడుతున్నారు. బిహార్, గుజరాత్, యూపీ, పశ్చిమబెంగాల్, తెలంగాణ రాష్ట్రాల్లో కొవిడ్ టెస్టుల సంఖ్య తక్కువగా ఉందని ఇటీవల ప్రధానమంత్రి నరేంద్రమోదీ అభిప్రాయపడ్డారు. ఈ రాష్ట్రాల్లో కొవిడ్ టెస్టుల సంఖ్య భారీగా పెంచాల్సి ఉందని ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సూచించిన విషయం తెలిసిందే.
భారీగా పెరిగిన కొవిడ్ నిర్ధారణ కేంద్రాలు..
దేశంలో వైరస్ వ్యాప్తిని కట్టడిచేసేందుకు టెస్టుల సంఖ్యను భారీగా పెంచాల్సిన అవసరాన్ని కేంద్రప్రభుత్వం రాష్ట్రాలకు సూచిస్తోంది. దీనిలో భాగంగా ఇప్పటికే దేశవ్యాప్తంగా కొవిడ్ నిర్ధారణ కేంద్రాలను భారీగా పెంచింది. జనవరి 23వరకు దేశంలో ఒకేఒక్క టెస్టింగ్ కేంద్రం ఉండగా మార్చి 23వరకు ఆ సంఖ్య 160కు పెంచింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కొవిడ్ నిర్ధారణ పరీక్షలు జరిపేందుకు 1470 కేంద్రాలకు ఐసీఎంఆర్ అనుమతినిచ్చింది. వీటిలో 969 ప్రభుత్వ ల్యాబ్లు ఉండగా, 501 ల్యాబ్లు ప్రైవేటు రంగంలో పనిచేస్తున్నాయి. దేశంలో కరోనా నిర్ధారణ కోసం ఆర్టీ-పీసీఆర్తోపాటు ట్రూనాట్, సీబీనాట్ విధానాలను అనుసరిస్తున్నారు.
ప్రపంచంలో అత్యధికంగా కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించడంలో అమెరికా అగ్రస్థానంలో ఉంది. ఇప్పటికే 7కోట్ల మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించినట్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అధిక టెస్టులు చేస్తోన్న దేశాల్లో భారత్ రెండో స్థానంలో ఉన్నట్లు ట్రంప్ పలుమార్లు స్పష్టం చేశారు. అయితే, వైరస్ తీవ్రత అధికంగా ఉన్న రష్యాలోనూ కొవిడ్ టెస్టులు భారీస్థాయిలో చేపడుతున్నారు. ఇప్పటికే అక్కడ 3కోట్లు టెస్టులు చేసినట్లు సమాచారం. ఇక కరోనా వైరస్కు మూలకారణమైన చైనాలో ఇప్పటివరకు 9కోట్ల మందికి కొవిడ్ టెస్టులు నిర్వహించినట్లు చైనా మీడియా పేర్కొంది. కానీ, దీనిపై చైనా ప్రభుత్వం అధికారిక ప్రకటన మాత్రం లేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
విజయ్ మాల్యా విదేశాల్లోని ఆస్తులపై భారత ప్రభుత్వం దృష్టిపెట్టింది. దీంతోపాటు ఆ దేశాలకు అతడు వస్తే అప్పగించాలని కోరుతోంది. తాజాగా ఫ్రాన్స్ను ఈ మేరకు అభ్యర్థించింది. -
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
Supreme Court: ఎన్నికల కౌంటింగ్లో మొత్తం వీవీ ప్యాట్ స్లిప్లను లెక్కించాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీనిపై దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టివేసింది. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం