అమెరికాలో మళ్లీ పెరిగిన మరణాలు
కరోనా మహమ్మారి ఉద్ధృతి నుంచి అగ్రరాజ్యానికి కాస్త ఉపశమనం లభించిందని అనుకుంటున్న తరుణంలో గురువారం మరోసారి మరణాల సంఖ్య భారీగా పెరిగింది.......
వాషింగ్టన్: కరోనా మహమ్మారి ఉద్ధృతి నుంచి అగ్రరాజ్యానికి కాస్త ఉపశమనం లభించిందని అనుకుంటున్న తరుణంలో గురువారం మరోసారి మరణాల సంఖ్య భారీగా పెరిగింది. జాన్ హాప్కిన్స్ అధ్యయనం ప్రకారం 24 గంటల్లో(బుధవారం-గురువారం మధ్య) 3,176 మంది మృతిచెందారు. దీంతో ప్రస్తుతం మృతుల సంఖ్య అక్కడ 50,363కు చేరింది. ఇక ఇప్పటి వరకు 8,89,999 మందికి వైరస్ సోకినట్లు నిర్ధారించారు. వీరిలో 82,112 మంది కోలుకున్నారు.
ఇక వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న న్యూయార్క్ నగరంలో 27 లక్షల మందికి వైరస్ సోకి ఉంటుందని ఓ అధ్యయనం వెల్లడించింది. 3000 మందిలో ‘యాంటీ బాడీ’ పరీక్షలు నిర్వహించడం ద్వారా ఈ అంచనాకు వచ్చామని ఆ రాష్ట్ర గవర్నర్ ఆండ్రూ క్యుమో తెలిపారు. దీన్ని బట్టి చూస్తే మరణాల రేటు చాలా తక్కువగా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే, అధికారిక మరణాల సంఖ్య కంటే వాస్తవ మరణాలు చాలా ఎక్కువగా ఉంటాయని ఆయన చెప్పారు. నర్సింగ్ హోమ్స్, ఇళ్లు, కేర్ హోమ్స్లో చనిపోయినవారిలోనూ కొవిడ్-19 రోగులు ఉండి ఉంటారని తెలిపారు. దీని వల్ల కచ్చితమైన మరణాల రేటు అంచనా వేయలేమన్నారు.
మరోవైపు న్యూయార్క్, న్యూజెర్సీ, కనెక్టీకట్, డెట్రాయిట్, న్యూ ఓర్లీన్స్ ప్రాంతాల్లో తీవ్రత తగ్గిన సంకేతాలు ఉన్నాయని ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ తెలిపారు. దేశవ్యాప్తంగానూ ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య క్రమంగా తగ్గుతోందన్నారు. ఇదే ట్రెండ్ కొనసాగితే.. వేసవి ప్రారంభానికల్లా పరిస్థితులు చక్కబడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటికే 16 రాష్ట్రాల్లో ఆర్థిక వ్యవస్థని తెరవడం క్రమంగా ప్రారంభించారన్నారు.
ఇవీ చదవండి..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
Supreme Court: ఎన్నికల కౌంటింగ్లో మొత్తం వీవీ ప్యాట్ స్లిప్లను లెక్కించాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీనిపై దాఖలపై అన్ని పిటిషన్లను కొట్టివేసింది. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం