CBSE: జులై 31నాటికి 12వ తరగతి ఫలితాలు!
జులై 31లోగా సీబీఎస్ఈ పరీక్షా ఫలితాలను ప్రకటించాలని యోచిస్తున్నట్లు గురువారం కేంద్రం సుప్రీం కోర్టుకు వెల్లడించింది. కరోనా ఉద్ధృతి నేపథ్యంలో 12వ తరగతి పరీక్షలను రద్దు చేస్తూ బోర్డు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. మరోపక్క అదే రోజున సీఐఎస్సీఈ ఫలితాలకు వెల్లడించాలని భావిస్తోంది.
సుప్రీంకు వెల్లడించిన కేంద్రం
దిల్లీ: జులై 31నాటికి సీబీఎస్ఈ పరీక్షా ఫలితాలను ప్రకటించాలని భావిస్తున్నట్లు గురువారం కేంద్రప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెల్లడించింది. కరోనా ఉద్ధృతి నేపథ్యంలో 12వ తరగతి పరీక్షలను రద్దు చేస్తూ బోర్డు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. మరోపక్క అదే రోజున సీఐఎస్సీఈ ఫలితాలకు వెల్లడించాలని భావిస్తోంది. సీబీఎస్ఈ పరీక్షా ఫలితాలపై సుప్రీం కోర్టులో కేంద్రం తరఫున అటార్నీ జనరల్ వాదనలు వినిపించారు. అలాగే మూల్యాంకన ప్రాతిపాదనల వివరాలను సీబీఎస్ఈ కోర్టుకు వెల్లడించింది. 10,11 తరగతులకు 30 శాతం వెయిటేజీ, 12వ తరగతికి 40 శాతం వెయిటేజీ ఇచ్చి 12వ తరగతి మార్కులను నిర్ణయించనున్నట్లు వివరించింది. 12వ తరగతిలో ప్రీ బోర్డు పరీక్షల ఆధారంగా 40 శాతం మార్కులు, 11వ తరగతి ఫైనల్ పరీక్షల ఆధారంగా 30 శాతం మార్కులు కేటాయించనున్నారు. అదే 10 తరగతికి సంబంధించి ఐదు పేపర్ల నుంచి మెరుగైన మార్కులున్న మూడు పేపర్లను పరిగణలోకి తీసుకుంటారని పేర్కొంది. ప్రాక్టికల్స్ విషయంలో పాఠశాలలు సమర్పించిన మార్కులను పరిగణలోకి తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ మార్కులతో సంతృప్తి చెందని విద్యార్థులు బోర్డు పరీక్షలు నిర్వహించిన సమయంలో హాజరుకావచ్చని కేంద్రం వెల్లడించింది.
జూన్ మొదటి వారంలో జరిగిన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో పరీక్షల రద్దు నిర్ణయానికి ప్రధాని నరేంద్రమోదీ ఆమోదముద్ర వేశారు. పరీక్షలు నిర్వహించాలా? వద్దా? అన్న అంశంపై రక్షణమంత్రి రాజ్నాథ్సింగ్ నేతృత్వంలోని మంత్రుల బృందం రాష్ట్రాల అభిప్రాయాలు తీసుకొని విశ్లేషించిన నేపథ్యంలో ఆ వివరాలన్నింటినీ విద్యాశాఖ అధికారులు ప్రధాని దృష్టికి తీసుకొచ్చారు. నిర్దేశిత ప్రమాణాలు, విద్యార్థుల ప్రతిభ ఆధారంగా నిర్దిష్ట గడువులోపు ఫలితాల వెల్లడికి బోర్డు చర్యలు తీసుకోనుంది. పలు రాష్ట్రాల్లో కొవిడ్ కేసుల నమోదు నేపథ్యంలో విద్యార్థుల ఆరోగ్యం, భద్రతను దృష్టిలో పెట్టుకొని రద్దు నిర్ణయం తీసుకొన్నామని ప్రధాని వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
Supreme Court: ఎన్నికల కౌంటింగ్లో మొత్తం వీవీ ప్యాట్ స్లిప్లను లెక్కించాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీనిపై దాఖలపై అన్ని పిటిషన్లను కొట్టివేసింది. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం