శశిథరూర్‌, అధిర్‌కు కరోనా పాజిటివ్‌ 

కరోనా బారిన పడుతున్న కాంగ్రెస్‌ పార్టీ ప్రముఖుల జాబితా రోజురోజుకీ పెరిగిపోతోంది. ఇటీవల కాంగ్రెస్‌ అగ్రనేతలు రాహుల్‌ గాంధీ, మన్మోహన్‌ సింగ్‌కు ..

Published : 22 Apr 2021 01:34 IST

దిల్లీ: కరోనా బారిన పడుతున్న కాంగ్రెస్‌ పార్టీ ప్రముఖుల జాబితా రోజురోజుకీ పెరిగిపోతోంది. ఇటీవల కాంగ్రెస్‌ అగ్రనేతలు రాహుల్‌ గాంధీ, మన్మోహన్‌ సింగ్‌కు కొవిడ్‌ సోకగా.. తాజాగా ఆ పార్టీకి చెందిన మరో ఇద్దరు ఎంపీలు వైరస్‌ బారిన పడ్డారు. తనకు కొవిడ్ సోకినట్టు కేంద్ర మాజీ మంత్రి, కేరళకు చెందిన ఎంపీ శశిథరూర్‌ ట్విటర్ ద్వారా వెల్లడించారు. ఇప్పటికే తన సోదరి, తన మాతృమూర్తి (85)కి వైరస్‌ సోకినట్టు తెలిపారు. తన సోదరి కాలిఫోర్నియాలో ఫైజెర్‌ టీకా తీసుకున్నారని, ఈ నెల 8న తన తల్లితో కలిసి తానూ కొవిషీల్డ్‌ రెండో డోసు తీసుకున్నట్టు వివరించారు.

మరోవైపు తానూ వైరస్‌ బారిన పడినట్టు బెంగాల్‌ పీసీసీ అధ్యక్షుడు, ఎంపీ అధిర్‌ రంజన్‌ చౌధురి ట్విటర్‌లో వెల్లడించారు. గత ఏడు రోజులుగా తనను కలిసినవారంతా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికల వేళ బిజీగా ఉన్న అధిర్‌.. తన ప్రచార కార్యక్రమాలు వర్చువల్‌గా కొనసాగిస్తానని స్పష్టంచేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని