Rahul Gandhi: అధికారంలోనే పుట్టినా.. దానిపై ఆసక్తి లేదు..!
ఇతర రాజకీయ నేతల వలే తనకు అధికారంపై ఆసక్తి లేదంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు.
సీఎం పోస్టు ఇస్తామన్నా మాయావతి ముందుకు రాలేదు: రాహుల్
దిల్లీ: ఇతర రాజకీయ నేతల వలే తనకు అధికారంపై ఆసక్తి లేదంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశాన్ని అర్థం చేసుకోవడంపైనే తాను ఎక్కువ దృష్టి పెట్టానని వెల్లడించారు. అలాగే బీఎస్పీతో పొత్తు గురించి ప్రస్తావించారు. శనివారం దిల్లీలో జరిగిన పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆయన పలు విషయాలపై స్పందించారు.
‘రాజకీయ నాయకులు అధికారం పొందేందుకు ప్రయత్నిస్తారు. వారు దాని గురించే ఆలోచిస్తారు. ఉదయాన్నే లేచి, అధికారం ఎలా సంపాదించుకోవాలని ఆలోచిస్తారు. అదే ఆలోచనతో నిద్రకు ఉపక్రమిస్తారు. ఈ దేశం మొత్తం అలాంటి నేతలే ఉన్నారు. అధికారానికి కేంద్రమైన కుటుంబంలో జన్మించాను. నిజం చెప్పాలంటే నాకు అధికారం మీద ఆసక్తి లేదు. దానికి బదులు దేశాన్ని అర్థం చేసుకోవడానికి, ప్రేమించడానికి ప్రయత్నిస్తున్నాను. ఒక ప్రేమికుడు తాను ప్రేమించే వ్యక్తి గురించి తెలుసుకోవాలనుకుంటున్నట్లుగా.. నేను ఈ దేశాన్ని అర్థం చేసుకోవాలనుకుంటున్నాను. ఈ దేశం నాకు ఎంతో ప్రేమను పంచింది. ఇక్కడ ద్వేషాన్ని కూడా చవిచూశాను. కానీ, నాకు కలిగే ప్రతి గాయం ఏదో ఒకటి నేర్పిస్తుంది’ అంటూ తన మనసులో మాటలను బయటపెట్టారు.
సీఎం పదవి ఆఫర్ చేసినా.. మాయావతి స్పందించలేదు..
ఈ సందర్భంగా ఇటీవల జరిగిన యూపీ అసెంబ్లీ ఎన్నికల గురించి ప్రస్తావించారు. ఎన్నికల ముందు పొత్తు నిమిత్తం బీఎస్పీ అధినేత్రి మాయావతిని సంప్రదించామని రాహుల్ అన్నారు. ఆమెకు ముఖ్యమంత్రి పదవి కూడా ఆఫర్ చేశామని వెల్లడించారు. కానీ ఆమె నుంచి ఏ స్పందనా రాలేదన్నారు. ‘ఈసారి ఎన్నికల్లో మాయావతి పోటీ పడలేదు. అది మీరు చూసుంటారు. మనం పొత్తు పెట్టుకుందాం.. ముఖ్యమంత్రి పదవి మీకే అంటూ ఒక సందేశం పంపాం. కానీ ఆమె ఒక్క మాట మాట్లాడలేదు. కాంగ్రెస్ ఓడిపోయింది అది వేరే విషయం. ఉత్తర్ప్రదేశ్లో దళితుల గళం వినిపించేందుకు కాన్షీరామ్జీ ఎంతో పోరాటం చేశారు. కానీ మాయావతి ఆ గళం కోసం పోరాడేందుకు రాలేదు. అందుకు కారణం కేంద్ర దర్యాప్తు సంస్థలు, పెగాసస్ వంటి స్పైవేర్లు. వారితో(ప్రస్తుత ప్రభుత్వం) ప్రజలు మాత్రమే పోరాడగలరు. వారు రాజ్యాంగాన్ని అమలు చేయనివ్వరు. వ్యవస్థల ద్వారా రాజ్యాంగం అమలవుతుంది. ఆ వ్యవస్థలను వారు స్వాధీనం చేసుకున్నారు. వ్యవస్థలు మన చేతిలో లేకపోతే.. రాజ్యాంగమూ మన చేతిలో ఉండదు’ అంటూ కేంద్రంపై మండిపడ్డారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
Supreme Court: ఎన్నికల కౌంటింగ్లో మొత్తం వీవీ ప్యాట్ స్లిప్లను లెక్కించాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీనిపై దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టివేసింది. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం