Covid Vaccines: ప్రాణాలకు రక్షణగా నిలుస్తోన్న టీకాలు!
ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన వ్యాక్సిన్లు ఈ మహమ్మారి నుంచి అత్యంత రక్షణ కల్పిస్తున్నట్లు తాజా అధ్యయనాల్లో వెల్లడవుతోంది
ఆసుపత్రి చేరికలు, మరణాల నుంచి 100శాతం రక్షణ - తాజా అధ్యయనం
వాషింగ్టన్: కరోనా వైరస్ మహమ్మారి చేస్తోన్న విలయానికి యావత్ ప్రపంచ దేశాలు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. అయితే, ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన వ్యాక్సిన్లు ఈ మహమ్మారి నుంచి అత్యంత రక్షణ కల్పిస్తున్నట్లు తాజా అధ్యయనాల్లో వెల్లడవుతోంది. వ్యాక్సిన్ల వల్ల ఇంగ్లాండ్లో ఇప్పటికే 12వేల మరణాలను నిర్మూలించగలిగినట్లు అక్కడి ప్రజారోగ్య విభాగం ఈమధ్యే వెల్లడించింది. ముఖ్యంగా కరోనా వల్ల ఆసుపత్రుల చేరికలు, మరణాల నుంచి వ్యాక్సిన్లు అత్యంత రక్షణ కల్పిస్తున్నాయని తాజాగా మరో అధ్యయనం తేల్చింది. ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చిన 8 టీకాల ఫలితాలను విశ్లేషించిన అనంతరం అమెరికా పరిశోధకులు తాజా విషయాన్ని మరోసారి ధ్రువీకరించారు.
మరణాల నుంచి 100శాతం రక్షణ..
కరోనా వైరస్ వల్ల కలిగే ఇన్ఫెక్షన్ల నుంచి సరాసరి 85శాతం, తీవ్ర లక్షణాలతో ఆసుపత్రిలో చేరికలు, మరణాల నుంచి 100శాతం రక్షణ కల్పిస్తున్నాయని యూనివర్సిటీ ఆఫ్ ఫ్లోరిడా పరిశోధకులు వెల్లడించారు. ఫైజర్, మోడెర్నా, జాన్సన్ అండ్ జాన్సన్, ఆస్ట్రాజెనెకా, స్పుత్నిక్, నొవావాక్స్, సినోవాక్ బయోటెక్, సినోఫార్మ్ వ్యాక్సిన్ల పనితీరును పరిశోధకులు విశ్లేషించారు. వీటికి సంబంధించి వివిధ జర్నల్లలో, ఇతర మీడియాలో ప్రచురితమైన అన్ని ప్రయోగాల నివేదికలను విశ్లేషించిన అనంతరం ఈ నివేదిక రూపొందించినట్లు పరిశోధకులు పేర్కొన్నారు. ఈ అధ్యయనం కోసం అమెరికా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ నుంచి విరాళం పొందిన ఈ పరిశోధనా బృందం.. వ్యాక్సినేషన్ ప్రణాళికలను రూపొందించడంలో ఆయా దేశాలకు ఈ అధ్యయనం శాస్త్రీయపరంగా ఎంతగానో దోహదపడుతుందన్నారు. రానున్న రోజుల్లో ఈ అధ్యయనాన్ని మరిన్ని వ్యాక్సిన్ల సమాచారంతో నవీకరిస్తామని పరిశోధకులు పేర్కొన్నారు.
క్లినికల్ ప్రయోగాల ఫలితాలనే కాకుండా వాస్తవ ఫలితాలకు సంబంధించిన నివేదికలను పరిశోధకులు విశ్లేషించారు. రెండు డోసులు తీసుకున్న తర్వాత మోడెర్నా-94.5శాతం, ఫైజర్-94.2శాతం, నోవావాక్స్-89.3శాతం, ఆస్ట్రాజెనెకా-81.5శాతం, సినోఫార్మ్-78.1శాతం, సినోవాక్-50,7శాతం సమర్థత కలిగినట్లు తాజా అధ్యయనాన్ని చేపట్టిన పరిశోధకులు అంచనా వేశారు. ఇక వైరస్ సంక్రమణను తగ్గించడంలో వ్యాక్సిన్ల సరాసరి సామర్థ్యం 54శాతం ఉందని కనుగొన్నారు.
కొత్త రకాలపైనా సమర్థవంతంగా..
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోన్న వేళ.. ఊహించని వేగంతో సురక్షిత, సమర్థవంతమైన వ్యాక్సిన్లను శాస్త్రవేత్తలు అందుబాటులోకి తీసుకువచ్చారు. అయినప్పటికీ కొత్తగా వెలుగుచూస్తోన్న కరోనా రకాలతో ఇంకా ముప్పు పొంచివుందని నిపుణులు అభిప్రాయపడ్డారు. యూకేలో వెలుగు చూసిన B.1.1.7 రకంపై సరాసరి 86శాతం, బ్రెజిల్ను వణికిస్తోన్న P.1 రకంపై 61శాతం, ఇక దక్షిణాఫ్రికాలో గుర్తించిన B.1.351 రకాన్ని 56శాతం సమర్థవంతంగా వ్యాక్సిన్లు ఎదుర్కొంటున్నాయని తెలిపారు.
ఇదిలాఉంటే, ప్రపంచవ్యాప్తంగా 176 దేశాల్లో కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినట్లు అంతర్జాతీయ నివేదికలు వెల్లడిస్తున్నాయి. మొత్తం ఇప్పటివరకు దాదాపు 165కోట్ల డోసులను పంపిణీ చేశారు. ఒక్క భారత్లోనే దాదాపు 20కోట్ల డోసులను అందించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
విజయ్ మాల్యా విదేశాల్లోని ఆస్తులపై భారత ప్రభుత్వం దృష్టిపెట్టింది. దీంతోపాటు ఆ దేశాలకు అతడు వస్తే అప్పగించాలని కోరుతోంది. తాజాగా ఫ్రాన్స్ను ఈ మేరకు అభ్యర్థించింది. -
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
Supreme Court: ఎన్నికల కౌంటింగ్లో మొత్తం వీవీ ప్యాట్ స్లిప్లను లెక్కించాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీనిపై దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టివేసింది. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం