Presidential Election: నూతన రాష్ట్రపతిగా ద్రౌపదీ ముర్ము.. యశ్వంత్ సిన్హాపై ఘన విజయం
రాష్ట్రపతి ఎన్నికల్లో(Presidential Election) ఎన్డీయే అభ్యర్థి ద్రౌపదీ ముర్మూ ఘన విజయం సాధించారు. విపక్షాల ఉమ్మడి అభ్యర్థి.....
దిల్లీ: రాష్ట్రపతి ఎన్నికల్లో(Presidential Election) ఎన్డీయే అభ్యర్థి ద్రౌపదీ ముర్మూ ఘన విజయం సాధించారు. విపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్ సిన్హాపై విజయం సాధించి భారత 15వ రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. మొత్తం నాలుగు రౌండ్లలో లెక్కింపు జరగ్గా.. ఒక రౌండ్ మిగిలి ఉండగానే ఆమె 50శాతానికి పైగా ఓట్లు సాధించడం ద్వారా దేశంలో అత్యున్నత పీఠాన్ని దక్కించుకున్న తొలి ఆదివాసీ మహిళగా చరిత్ర సృష్టించారు. ఈ ఎన్నికల్లో మొత్తంగా 4754 ఓట్లు పోలవ్వగా.. 53 ఓట్లు చెల్లుబాటు కానివిగా గుర్తించారు. చెల్లుబాటైన 4701 ఓట్లలో ద్రౌపదీ ముర్ము 2,824 ఓట్లు సాధించగా.. వాటి విలువ 6,76,803 అని రాజ్యసభ సెక్రటరీ జనరల్, రిటర్నింగ్ అధికారి పీసీ మోదీ వెల్లడించారు. అలాగే, యశ్వంత్ సిన్హాకు 1,877 ఓట్లు రాగా.. వాటి విలువ 3,80,177. దీంతో ద్రౌపదీ ముర్ము నూతన రాష్ట్రపతిగా ఎన్నికైనట్టు ఆయన అధికారికంగా ప్రకటించారు.
- తొలి రౌండ్ ఫలితం: తొలి రౌండ్లో ఎంపీల ఓట్లు లెక్కించారు. మొత్తం 763మంది ఎంపీలు ఓటు వేయగా.. వీటిలో 15 ఓట్లు చెల్లలేదు. దీంతో 748 ఓట్లలో ద్రౌపదీ ముర్ముకు 540 ఓట్లు రాగా (విలువ 3,78,000).. విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు 208 ఓట్లు (విలువ 1,45,600) వచ్చాయని రిటర్నింగ్ అధికారి, రాజస్యసభ సెక్రటరీ జనరల్ పీసీ మోదీ తెలిపారు.
- రెండో రౌండ్ ఫలితం: రెండో రౌండ్లో ద్రౌపదీ ముర్ము భారీ ఆధిక్యంలో దూసుకుపోతున్నారు. రెండో రౌండ్లో 10 రాష్ట్రాలను ఆంగ్ల అక్షర క్రమంలో తీసుకొని ఓట్ల లెక్కింపు చేపట్టారు. ఆయా రాష్ట్రాల్లో ఓట్ల సంఖ్య 1138 కాగా.. వాటి విలువ 1,49,575. వీటిలో ఎన్డీయే అభ్యర్థి ద్రౌపదీ ముర్మూకు 809 ఓట్లు (ఓట్ల విలువ 1,05,299) రాగా.. విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు 329 (ఓట్ల విలువ 44,276) వచ్చాయి.
- మూడో రౌండ్: మూడో రౌండ్ లెక్కింపు పూర్తయింది. ఈ రౌండ్లో కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మణిపూర్, మేఘాలయా, మిజోరం, నాగాలాండ్, ఒడిశా, పంజాబ్ రాష్ట్రాలు కవర్ అయ్యాయని రాజ్యసభ సెక్రటరీ జనరల్ పీసీ మోడీ వెల్లడించారు. ఈ రౌండ్లో 1333 ఓట్లు చెల్లుబాటు కాగా.. వీటి విలువ 1,65,664గా ఉన్నట్టు తెలిపారు. వీటిలో ద్రౌపదీ ముర్ముకు 812 ఓట్లు, యశ్వంత్ సిన్హాకు 521 ఓట్లు వచ్చినట్టు వెల్లడించారు.
- నాలుగు రౌండ్లలో కలిపి ఇలా.. ఈ ఎన్నికల్లో మొత్తంగా 4,754 ఓట్లు పోలవ్వగా.. 53 ఓట్లు చెల్లుబాటు కానివిగా గుర్తించారు. చెల్లుబాటైన 4,701 ఓట్లలో ద్రౌపదీ ముర్ము 2,824 ఓట్లు సాధించగా.. వాటి విలువ 6,76,803. అలాగే, యశ్వంత్ సిన్హాకు 1,877 ఓట్లు రాగా.. వాటి విలువ 3,80,177. నూతన రాష్ట్రపతిగా భారీ విజయం సాధించిన ద్రౌపదీ ముర్మును ప్రధాని నరేంద్ర మోదీ కలిశారు. దిల్లీలోని ఆమె తాత్కాలిక నివాసానికి వెళ్లిన ప్రధాని.. ఆమెకు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు చెప్పారు.
- ద్రౌపదీ ముర్ముకు ప్రముఖుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆమెకు అభినందనలు తెలిపారు. పార్టీలకు అతీతంగా ద్రౌపదీకి మద్దతు తెలిపిన ఎంపీలు, ఎమ్మెల్యేలందరికీ ఈ సందర్భంగా మోదీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
- ద్రౌపదీ ముర్ము స్వగ్రామం ఒడిశాలోని రాయ్రంగ్పూర్లో సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి. 20వేల మిఠాయిలు చేసి సిద్ధంగా ఉంచారు. ఫలితాలు వెలువడ్డాక ఆదివాసీ సంప్రదాయ నృత్యంతో విజయోత్సవ ఊరేగింపు నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు.
- కౌంటింగ్ ఈ మధ్యాహ్నం 1.30గంటలకు పార్లమెంట్ హౌస్లో ప్రారంభమైంది. తొలి రౌండ్లో ఎంపీల ఓట్లు లెక్కించగా.. ఆ తర్వాత అక్షర క్రమంలో రాష్ట్రాల వారీగా ఓట్ల లెక్కింపు పూర్తి చేశారు.
- ముర్ము విజయం సాధించాక దిల్లీ భాజపా విజయోత్సవ రోడ్షో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. పార్టీ ప్రధాన కార్యాలయం నుంచి రాజ్పథ్ వరకు రోడ్షో నిర్వహించనున్నారు. ఈ రోడ్షోలో భాజపా సీనియర్ నేతలు పాల్గొనే అవకాశం ఉంది. అలాగే, అన్ని రాష్ట్రాల్లో భాజపా నేతలు విజయోత్సవ వేడుకలకు సిద్ధమయ్యారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘400 మంది మహిళలపై ప్రజ్వల్ అఘాయిత్యం’ - రాహుల్ సంచలన ఆరోపణ
హసన ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ (Prajwal Revanna) దాదాపు 400 మంది మహిళలపై అఘాయిత్యానికి పాల్పడ్డాడని రాహుల్ గాంధీ ఆరోపించారు. -
లైంగిక దౌర్జన్యం కేసు.. ప్రజ్వల్ రేవణ్ణపై లుక్అవుట్ నోటీసు
Prajwal Revanna: లైంగిక వేధింపుల కేసులో జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై ప్రత్యేక దర్యాప్తు బృందం లుక్ అవుట్ నోటీసు జారీ చేసింది. -
దిల్లీ ఎల్జీ కీలక నిర్ణయం.. మహిళా కమిషన్లో 223 మంది తొలగింపు
Delhi Commission for Women: దిల్లీ మహిళా కమిషన్లో 223 మంది ఉద్యోగులపై లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా వేటు వేశారు. వారిని తక్షణమే విధుల్లో నుంచి తొలగించారు. -
భానుడి ప్రతాపం.. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద గ్రీన్నెట్స్..
మండుటెండల్లో వాహనదారులకు కాస్త ఉపశమనం కల్పించింది పుదుచ్చేరి ప్రభుత్వం. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద గ్రీన్ షేడ్ నెట్స్ను ఏర్పాటు చేసింది. -
ప్రైవేటు ఆస్తిని సమాజ ఉమ్మడి వనరుగా నిర్ణయిస్తే భవిష్యత్తుకు ఇంకేమీ మిగలదు
వ్యక్తుల ప్రైవేటు ఆస్తులను సమాజ ఉమ్మడి ఆర్థిక వనరులుగా పరిగణించడం చట్టబద్ధమేనా అనే న్యాయపరమైన అంశంపై తీర్పును సుప్రీంకోర్టు బుధవారం రిజర్వు చేసింది. -
వడగళ్లతో దెబ్బతిన్న రెక్కలు..విమానానికి తప్పిన ప్రమాదం
ఒడిశా రాజధాని భువనేశ్వర్ నుంచి 170 మందితో బుధవారం మధ్నాహ్నం 1.45 గంటలకు దిల్లీకు ప్రయాణమైన విస్తారా ఎయిర్లైన్స్కు చెందిన విమానం టేకాఫ్ అయిన 10 నిమిషాలకే ప్రమాదానికి గురైంది. -
దిల్లీలో బాంబు బెదిరింపుల కలకలం
దేశ రాజధాని ప్రాంతంలోని సుమారు 150 పాఠశాలలకు బాంబు బెదిరింపులు రావడం బుధవారం తీవ్ర కలకలం రేపింది. -
10 దేశాల రాజకీయ పార్టీల ప్రతినిధులతో నడ్డా భేటీ
సార్వత్రిక ఎన్నికలను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు భాజపా ఆహ్వానంపై 10 దేశాల నుంచి 18 పార్టీల ప్రతినిధులు భారత్కు విచ్చేశారు. -
అలాగైతే హంతకులూ ఎన్నికల వేళ రాజకీయ పార్టీలు ప్రారంభిస్తారు!
అరెస్టైన రాజకీయ నాయకులకు వర్చువల్ విధానంలో ఎన్నికల ప్రచారం నిర్వహించుకునే అవకాశం కల్పించాలన్న వినతిపై దిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. -
కొవిషీల్డ్ సురక్షితమైందే.. ఆందోళన వద్దు
తమ కరోనా వ్యాక్సిన్ కొవిషీల్డ్ సురక్షితమైందేనని ఆస్ట్రాజెనకా కంపెనీ పునరుద్ఘాటించింది. తమ టీకా తీసుకున్నవారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది. -
శని, ఆదివారాలూ మాకు తీరిక ఉండదు
సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు సెలవులు సుదీర్ఘంగా తీసుకుంటారంటూ చేసే విమర్శలపై అత్యున్నత న్యాయస్థానం ఘాటుగా స్పందించింది. -
‘స్మార్ట్’ అస్త్ర ప్రయోగం విజయవంతం!
సూపర్సోనిక్ మిసైల్ అసిస్టెడ్ రిలీజ్ ఆఫ్ టోర్పిడో (స్మార్ట్) అనే ఆయుధ వ్యవస్థను భారత్ బుధవారం విజయవంతంగా పరీక్షించింది. -
డీప్ ఫేక్ వీడియోలపై వెంటనే చర్యలుండాలి
సార్వత్రిక ఎన్నికల వేళ డీప్ ఫేక్ వీడియోలు తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. ఇలాంటివి వెలుగు చూసిన వెంటనే జాప్యంలేకుండా వాటి వ్యాప్తిని అరికట్టేలా కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ న్యాయవాదుల బృందం దిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. -
ఉష్ణోగ్రతలు గరిష్ఠ‘మే’! : ఐఎండీ
దేశంలోని పలు ప్రాంతాల్లో మే నెల సాధారణం కంటే ఎక్కువగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముంది. -
యాప్ ఆధారిత పెట్టుబడి పథకాలు.. దేశవ్యాప్తంగా సీబీఐ సోదాలు
క్రిప్టోకరెన్సీ మైనింగ్ యంత్రాల అద్దెలపై పెట్టుబడుల పేరుతో మోసపూరిత పథకాల ద్వారా ప్రజల్ని ఒక యాప్ మోసగిస్తోందనే ఆరోపణలమీద దేశంలో 30 చోట్ల సీబీఐ బలగాలు సోదాలు నిర్వహించాయి. -
సూరత్ ఏకగ్రీవ ఎన్నికపై అత్యవసర విచారణకు హైకోర్టు నిరాకరణ
సూరత్ లోక్సభ స్థానం నుంచి భాజపా అభ్యర్థి ముకేశ్ దలాల్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) పై అత్యవసర విచారణ జరిపేందుకు గుజరాత్ హైకోర్టు నిరాకరించింది. -
కొవిషీల్డ్పై వైద్య నిపుణుల కమిటీని ఏర్పాటు చేయండి
ఆస్ట్రాజెనకా కరోనా టీకాపై తాజా దుమారం నేపథ్యంలో కొవిషీల్డ్ వ్యాక్సిన్ దుష్ప్రభావాలు, ముప్పు కారకాల అవకాశాలను పరిశీలించేందుకు వైద్య నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలంటూ బుధవారం సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. -
అయోధ్య రాముని సేవలో రాష్ట్రపతి
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అయోధ్య రాముడిని దర్శించుకున్నారు. బాలరాముడి ముందు మోకరిల్లి నమస్కరిస్తున్న చిత్రాలను ఆమె ‘ఎక్స్’ వేదికగా పంచుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
‘పుష్ప2’ స్టెప్పై డేవిడ్ వార్నర్ కామెంట్.. చాలా ఈజీ అంటూ రిప్లై ఇచ్చిన బన్నీ
-
విరాట్ స్ట్రైక్రేట్ను విమర్శించే స్థాయి మీకుందా?: ఏబీ డివిలియర్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
లావుగా ఉన్నాడని కొడుకుతో బలవంతంగా ట్రెడ్మిల్.. ఆరేళ్ల బాలుడి మృతి
-
మచిలీపట్నంలో వైకాపా అభ్యర్థి పేర్ని కిట్టు అనుచరుల వీరంగం
-
అమెజాన్, ఫ్లిప్కార్ట్ సేల్స్ షురూ.. స్మార్ట్ఫోన్లపై ఆఫర్లు ఇవిగో..