Air India: ప్రైవేటీకరణకు ముందే ఎయిరిండియా బెటర్.. ప్రధాని సలహాదారు ఆగ్రహం..!
ఎయిరిండియా (Air India)ను ప్రైవేటీకరించే కంటే ముందే ఆ సంస్థ సేవలు మెరుగ్గా ఉన్నాయని ప్రధాని సలహాదారు వివేక్ దెబ్రాయ్ అన్నారు. ఎయిరిండియా విమానం ఆలస్యమవడంపై ఆయన మండిపడ్డారు.
దిల్లీ: టాటాల ఆధీనంలో ఉన్న ఎయిరిండియా (Air India)పై ప్రధానమంత్రి (PM) ఆర్థిక సలహా మండలి ఛైర్మన్ వివేక్ దెబ్రాయ్ (Bibek Debroy) తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఎయిరిండియాతో విసిగిపోయామని, ప్రైవేటీకరణ కంటే ముందే ఆ విమానయాన సంస్థ మెరుగ్గా ఉందని విమర్శించారు. ముంబయి నుంచి దిల్లీ వెళ్లాల్సిన ఎయిరిండియా విమానం ఆలస్యమవడంతో వివేక్ ట్విటర్ వేదికగా ఎయిర్లైన్పై మండిపడ్డారు.
‘‘ఎయిరిండియా (Air India)తో విసిగిపోయా. ఈ ఎయిర్లైన్కు చెందిన విమానంలో దిల్లీకి టికెట్ బుక్ చేసుకున్నా. సాయంత్రం 4.35 గంటలకు విమానం బయల్దేరాల్సి ఉంది. కానీ విమానం ఆలస్యమైంది. దానికి సంబంధించి ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. ప్రైవేటీకరణకు ముందే ఈ సంస్థ సేవలు మెరుగ్గా ఉండేవి’’ అని వివేక్ ఎయిర్లైన్ యాజమాన్యాన్ని విమర్శించారు. ఎక్కువ విమానాలు ఆర్డర్ చేసినంత మాత్రాన విమాన సేవలు వాటంతటవే మెరుగు పడవని ఆయన వరుస ట్వీట్లలో ఎద్దేవా చేశారు.
దీనికి ఎయిరిండియా (Air India) బదులిస్తూ.. నిర్వహణ కారణాల రీత్యా విమానం ఆలస్యమైందని తెలిపింది. ప్రయాణికులకు సాయం చేసేందుకు తమ అధికారుల బృందం నిరంతరం శ్రమిస్తూనే ఉంటుందని పేర్కొంది. అయితే ఎయిర్లైన్ స్పందనపైనా వివేక్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎయిరిండియా బృందం ప్రయాణికులకు ఎలాంటి సాయం చేయలేదని మండిపడ్డారు. విమానయాన సంస్థ తీరుతో ప్రయాణికులు ఆగ్రహిస్తున్నారని అన్నారు. ఇకపై తాను ఎయిరిండియాలో ప్రయాణించబోనని తెలిపారు.
ఏడు దశాబ్దాలుగా ప్రభుత్వ అధీనంలో ఉన్న ఎయిరిండియా (Air India) ప్రైవేటీకరణలో భాగంగా గతేడాది జనవరిలో టాటా గ్రూప్ (TATA Group) చేతుల్లోకి వెళ్లిన విషయం తెలిసిందే. ఇటీవల ఈ సంస్థ 470 విమానాల కొనుగోలుకు ఎయిర్బస్, బోయింగ్ సంస్థలకు ఆర్డర్ పెట్టింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
Supreme Court: ఎన్నికల కౌంటింగ్లో మొత్తం వీవీ ప్యాట్ స్లిప్లను లెక్కించాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీనిపై దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టివేసింది. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం