ఫలించిన 80 ఏళ్ల పోరాటం.. 93 ఏళ్ల మహిళకు దక్కిన ఆస్తి
ఎనిమిది దశాబ్దాల భూ వివాదాన్ని (Property Dispute) బాంబే హైకోర్టు (Bombay HC) పరిష్కరించింది. దక్షిణ ముంబయిలోని రెండు ఫ్లాట్లను ఆ ఇళ్ల అసలైన యజమాని అయిన 93 ఏళ్ల బామ్మకు అప్పగించాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ముంబయి: వారసత్వ ఆస్తి కోసం ఓ మహిళ చేసిన అలుపెరగని న్యాయ పోరాటం ఫలించింది. ఎనిమిది దశాబ్దాల భూవివాదాన్ని పరిష్కరిస్తూ 93 ఏళ్ల అలిస్ డిసౌజాకు ఆ ఆస్తి తిరిగిచ్చేయాలని బాంబే హైకోర్టు (Bombau High Vourt) మహారాష్ట్ర ప్రభుత్వాన్ని (Maharashtra Govt) ఆదేశించింది. దీంతో 80 ఏళ్ల తర్వాత రెండు ఫ్లాట్లు తిరిగి ఆ బామ్మకు దక్కబోతున్నాయి. వివరాల్లోకి వెళితే..
దక్షిణ ముంబయి (South Mumbai)లోని బరాక్ రోడ్లో ఉన్న రూబీ మాన్షన్ (Ruby Mansion) భవనాన్ని 1942 మార్చిలో అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం డిఫెన్స్ ఆఫ్ ఇండియా (Defence of India) చట్టం కింద తమ అధీనంలోకి తీసుకుంది. అలా ఈ భవనంలోని మొదటి అంతస్తులో అలిస్ డిసౌజా కుటుంబానికి చెందిన రెండు ఫ్లాట్లు (500 చదరపు అడుగులు, 600 చదరపు అడుగులు) బ్రిటిష్ ప్రభుత్వం చేతుల్లోకి వెళ్లాయి. అనంతరం ఇందులోని ఫ్లాట్లను అప్పటి ప్రభుత్వ అధికారులకు కేటాయించారు. డిసౌజా ఫ్లాట్లను.. డీఎస్ లాడ్ అనే అధికారికి అప్పగించారు. అప్పట్లో లాడ్ సివిల్ సర్వీస్ విభాగంలో పనిచేసేవారు.
అయితే 1946లో ఈ రిక్విసిషన్ (ప్రైవేటు ఆస్తులను బ్రిటిష్ పాలకులు స్వాధీనం చేసుకోవడం) ఆదేశాలను ఎత్తివేయడంతో రూబీ మాన్షన్లోని ఫ్లాట్లను తిరిగి అసలైన యజమానులకు అప్పగించడం మొదలుపెట్టారు. కానీ, లాడ్ కుటుంబం మాత్రం ఈ ఫ్లాట్లను ఖాళీ చేసేందుకు అంగీకరించలేదు. దీంతో డిసౌజా తండ్రి నాటి కలెక్టర్ దగ్గరకు వెళ్లగా.. ఫ్లాట్లను ఖాళీ చేయాలని ఆదేశించారు. అయినప్పటికీ లాడ్ కుటుంబం ఇళ్లను అప్పగించలేదు. అప్పటి నుంచి ఈ వివాదం కొనసాగుతూనే ఉంది.
2010లో కంట్రోలర్ ఆఫ్ అకామిడేషన్ కూడా ఆ ఫ్లాట్లను ఖాళీ చేయాలని లాడ్ కుమారుడు, కుమార్తెకు ఆదేశాలు జారీ చేసింది. అప్పటికి లాడ్ మరణించారు. ఈ ఆదేశాలను అప్పీలేట్ అథారిటీ కూడా సమర్థించింది. దీంతో 2012లో లాడ్ వారసులు హైకోర్టును ఆశ్రయించగా.. కోర్టు కూడా వారి అభ్యర్థనను తోసిపుచ్చింది. డిసౌజా కుటుంబానికి ఇళ్లను అప్పగించాలని ఆదేశాలిచ్చింది. కానీ, లాడ్ వారసులు మాత్రం కోర్టు తీర్పును పాటించలేదు.
దీంతో డిసౌజా మరోసారి బాంబే హైకోర్టును ఆశ్రయించారు. ‘‘రిక్విసిషన్ ఉత్తర్వులను ఉపసంహరించిన తర్వాత ఆ భవనంలోని ఇతర ఫ్లాట్లను అసలైన యజమానులకు అప్పగించారు. మా ఫ్లాట్లను మాత్రం ఇంతవరకూ మేం తిరిగి పొందలేకపోయాం’’ అని ఆమె పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై ఇటీవల విచారణ జరిపిన హైకోర్టు.. తాజాగా తీర్పు వెలువరించింది. ఎనిమిది వారాల్లో ఆ రెండు ఫ్లాట్లను ఖాళీ చేయించి డిసౌజాకు అప్పగించాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అటల్ సేతుపై రష్మిక వీడియో.. స్పందించిన మోదీ
అటల్ సేతు గురించి సినీనటి రష్మిక (Rashmika Mandanna) మాట్లాడిన వీడియోపై ప్రధాని మోదీ(Modi) స్పందించారు. -
అతడు నన్ను కాలితో తన్నాడు.. కడుపుపై కొట్టాడు: దాడి ఘటనపై స్వాతి మాలీవాల్
Swati Maliwal: దిల్లీ సీఎం కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్ కుమార్ తనను దారుణంగా కొట్టాడని ఆప్ ఎంపీ స్వాతి మాలీవాల్ ఆరోపించారు. కడుపుపై కొట్టి, కాలితో తన్నాడని పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. -
టిష్యూ పేపర్పై ‘బాంబ్’ నోట్.. విమానంలో కలకలం
టేకాఫ్కు సిద్ధంగా ఉన్న ఓ విమానంలో ‘బాంబ్’ అని రాసి ఉన్న టిష్యూ పేపర్ లభ్యం కావడం కలకలం రేపింది. దీంతో సిబ్బంది, ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. -
ఇష్టారాజ్యంగా ప్రైవేటు ఆస్తుల స్వాధీనం చెల్లదు: సుప్రీంకోర్టు
నష్టపరిహారం చెల్లించినప్పటికీ ప్రైవేటు ఆస్తుల స్వాధీనానికి సంబంధించి ప్రభుత్వాలు, ప్రభుత్వ విభాగాలు సరైన విధానాలు పాటించాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
వేలు తీయమంటే.. నాలుకకు శస్త్రచికిత్స చేశారు!
ఆరో వేలు తీయించేందుకు ఆసుపత్రికి తీసుకెళ్లిన చిన్నారి నాలుకకు శస్త్రచికిత్స చేసిన దారుణ సంఘటన కేరళలో చోటుచేసుకుంది. -
జూన్ 29 నుంచి అమర్నాథ్ యాత్ర
జమ్మూకశ్మీర్లో ప్రఖ్యాత అమర్నాథ్ యాత్ర జూన్ 29న ప్రారంభం కానుంది. ఆగస్టు 19 వరకు అది కొనసాగుతుంది. -
‘చీపుళ్ల’తో కష్టాలను ఊడ్చేసింది!
వ్యాపారం అనగానే ఎవరికైనా మగవారే గుర్తుకొస్తుంటారు. కానీ, మేమూ ఏం తక్కువ కాదంటోంది ఓ మహిళ. అనడమే కాదు.. స్వయంకృషితో రాణిస్తూ, మరింత మంది ఆడవాళ్లకు ఉపాధి కల్పిస్తోంది. -
కేజ్రీవాల్కు మినహాయింపులివ్వలేదు
అరవింద్ కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ ఉత్తర్వులపై జరుగుతున్న రాజకీయ చర్చపై గురువారం సుప్రీంకోర్టు స్పష్టతనిచ్చింది. బెయిల్ విషయంలో దిల్లీ సీఎంకు తాము ఎలాంటి ప్రత్యేక మినహాయింపులు ఇవ్వలేదని తెలిపింది. -
మాలీవాల్పై దాడి ఘటనలో ఎఫ్ఐఆర్ నమోదు
ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యురాలు స్వాతి మాలీవాల్పై దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వ్యక్తిగత సహాయకుడు బిభవ్ కుమార్ దాడికి పాల్పడిన ఘటనపై గురువారం పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. -
సీబీఐ అదనపు సంచాలకులుగా ఏవైవీ కృష్ణ, ఎన్.వేణుగోపాల్
సీబీఐలో అదనపు సంచాలకులుగా సీనియర్ ఐపీఎస్ అధికారులు ఏవైవీ కృష్ణ, ఎన్.వేణుగోపాల్ నియమితులయ్యారు. 1995 బ్యాచ్ అస్సాం-మేఘాలయ క్యాడర్కు చెందిన కృష్ణ ప్రస్తుతం సీఆర్పీఎఫ్లో ఇన్స్పెక్టర్ జనరల్గా పనిచేస్తున్నారు. -
ప్రత్యేక కోర్టు పరిశీలనలో కేసు ఉంటే నిందితుడిని ఈడీ అరెస్టు చేయకూడదు
మనీలాండరింగ్ కేసు ప్రత్యేక కోర్టు పరిశీలనలో ఉన్న సమయంలో నిందితుడిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేయరాదని సుప్రీంకోర్టు తెలిపింది. -
హోర్డింగ్ కూలిన ప్రాంతంలో రోడ్ షో నిర్వహించడం అమానవీయం
దేశ వాణిజ్య రాజధాని ముంబయిలో ఇటీవల ఇనుప హోర్డింగ్ కుప్పకూలి 16 మంది ప్రాణాలు కోల్పోయిన ప్రాంతం మీదుగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ రోడ్ షో నిర్వహించడం అమానవీయమని శివసేన (యూబీటీ) రాజ్యసభ సభ్యుడు సంజయ్రౌత్ విమర్శించారు. -
పిడుగుపాటుకు 11 మంది దుర్మరణం
అకాల వర్షాలకు వివిధ ప్రాంతాల్లో ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది. పశ్చిమబెంగాల్లోని మాల్దా జిల్లా వ్యాప్తంగా గురువారం పిడుగుపాటుకు మొత్తం 11 మంది మృతిచెందినట్లు ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. -
నిర్బంధ కేంద్రంలో మగ్గుతున్న 17 మంది విదేశీయులను వెనక్కు పంపండి
అస్సాంలోని నిర్బంధ కేంద్రంలో మగ్గుతున్న 17 మంది విదేశీయులను విడుదల చేసి వెనక్కు పంపించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. -
రెండు రాష్ట్రాల్లో ఓబీసీ రిజర్వేషన్ల పెంపు
పంజాబ్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో ప్రభుత్వ ఉద్యోగాల్లో ఇతర వెనుకబడిన కులాలకు (ఓబీసీ) రిజర్వేషన్ కోటా పెంచాలని జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ (ఎన్సీబీసీ) సిఫార్సు చేసింది. -
స్వర్ణ దేవాలయంలో కేజ్రీవాల్ ప్రార్థనలు
పంజాబ్లో రోడ్ షో నిర్వహించేందుకు అమృత్సర్ చేరుకున్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గురువారం స్వర్ణదేవాలయంలో ప్రార్థనలు నిర్వహించారు. -
దాడి ఘటనపై తొలిసారి స్పందించిన స్వాతి మాలీవాల్
తనపై ఇటీవల జరిగిన దాడి ఘటనపై ఆప్ ఎంపీ స్వాతి మాలీవాల్ ఎక్స్(ట్విటర్) వేదికగా స్పందించారు.
తాజా వార్తలు (Latest News)
-
వివేకా హత్య కేసు.. నాంపల్లి కోర్టులో విచారణకు హాజరైన ఎంపీ అవినాష్రెడ్డి
-
నువ్వు కొత్త ప్లేయర్వి కాదు.. వరల్డ్ కప్లో సత్తా చాటాలి: గంభీర్
-
సైలెంట్గా ఓటీటీలోకి ‘కృష్ణమ్మ’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే
-
కొత్తవలసలోని జిందాల్ పరిశ్రమ మూసివేత
-
కిడ్నాప్ చేసి.. పొరుగింట్లోనే 26 ఏళ్లు బంధించి..!
-
ఆ బాలుడి మృతి ‘వన్ చిప్ ఛాలెంజ్’ వల్లేనా?.. ఇంతకీ ఏంటీ సవాల్?