భారత్లో అందుకే కేసులు పెరుగుతున్నాయా?
కరోనా వైరస్ను అరికట్టడానికి దేశంలో లాక్డౌన్ విధించి సుమారు రెండు నెలలు గడుస్తున్న నేపథ్యంలో వలస కూలీలు స్వస్థలాలకు వెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం తాజాగా ఆంక్షలను సడలించింది...
ట్రక్కులు, టెంపోల్లో ప్రయాణిస్తున్న వలసదార్లు..
ముంబయి: కరోనా వైరస్ను అరికట్టడానికి దేశంలో లాక్డౌన్ విధించి సుమారు రెండు నెలలు గడుస్తున్న నేపథ్యంలో వలస కూలీలు స్వస్థలాలకు వెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం తాజాగా ఆంక్షలను సడలించింది. వారి తరలింపునకు శ్రామిక్ రైళ్లు, ఆర్టీసీ బస్సులు ఏర్పాట్లు చేసినా చాలా మంది వలసదార్లు లారీలు, టెంపో వాహనాల్లో వెళ్లేందుకే మోగ్గుచూపుతున్నారు. ఈ క్రమంలో భౌతిక దూరం పాటించకుండా ప్రయాణిస్తూ కరోనా వ్యాప్తి చెందడానికి కారణమవుతున్నారు! దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో అనేక రాష్ట్రాల నుంచీ వేల సంఖ్యలో వలసలు వచ్చి జీవిస్తుంటారు. లాక్డౌన్ కారణంగా వారందరికీ ఉపాధి లేకపోవడంతో చేతిలో డబ్బులు కరవయ్యాయి. ఇక చేసేది లేక స్వగ్రామాలకు వెళ్లేందుకు సిద్ధమవుతూ ప్రైవేటు వాహనాల్లో ప్రయాణిస్తున్నారు.
ఒక్కొక్కరి నుంచి రూ.1500 నుంచి 4500 వసూలు చేస్తున్నారు..
బస్సుల్లో వెళ్తే కేవలం ఆయా రాష్ట్రాల సరిహద్దుల వరకే వెళ్లాల్సి వస్తుందని. రైళ్లలో వెళ్లాలంటే తమ గమ్యస్థానాలకు దూరంగా ఉండే స్టేషన్లలో దిగాల్సి వస్తుందని అనేక మంది వాపోతున్నారు. ఈ క్రమంలో అక్కడి నుంచి మళ్లీ తమ స్వగ్రామాలకు చేరుకోవాలంటే ప్రత్యామ్నాయ రవాణా ఏర్పాట్లు చేసుకోవాల్సి వస్తుందని చెప్పారు. అందుకు బదులు లారీల్లో, టెంపో వాహనాల్లో వెళితే తమకు అనుకూలంగా, స్వగ్రామాల దగ్గర్లో దిగి వెళ్లొచ్చని అభిప్రాయపడ్డారు. ఇలా ప్రయాణించడం కష్టమైనా ఇదే ఉత్తమ మార్గమని చెబుతున్నారు. మరోవైపు దొరికిందే అవకాశంగా.. లారీ డ్రైవర్లు, టెంపో వాహనాల యజమానులు వలసకార్మికుల నుంచి నిలువు దోపిడీ చేస్తున్నారు. ముంబయి నుంచి మధ్యప్రదేశ్, ఉత్తర్ప్రదేశ్, బిహార్, ఝార్ఖండ్ లాంటి రాష్ట్రాలకు వెళ్లాలంటే ఒక్కో వ్యక్తి నుంచి సుమారు రూ.1500 నుంచి 4500 దాకా వసూలు చేస్తున్నారు. ఏదేమైనా తొందరగా స్వగ్రామాలకు వెళ్లాలని భావించి వారు కూడా అధికమొత్తంలో చెల్లించి ప్రయాణాలు సాగిస్తున్నారు.
ఇప్పుడు రహదార్ల వెంట నడిచే వారు తగ్గారు..
కాగా, ఆంక్షల సడలింపులకు ముందు అనేక మంది వలసదార్లు తట్టాబుట్టా సర్దుకొని జాతీయ రహదార్లపై నడుచుకుంటూ వెళ్లడం సాగించేవారు. ఇప్పుడు రవాణా సౌకర్యాలు కాస్త మెరుగవ్వడంతో అలా నడిచి వెళ్లే వారి సంఖ్య బాగా తగ్గిందని రహదార్ల వెంట నివసించే స్థానికులు చెబుతున్నారు. దేశంలో మహారాష్ట్రలోనే అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు అక్కడి నుంచి పెద్ద సంఖ్యలో వలసదార్లు లారీల్లో, ఇతర వాహనాల్లో గుమిగూడి వెళ్తుండడంతో భౌతిక దూరం పాటించలేకపోతున్నారు. దీంతో కేసులు పెరిగే అవకాశం లేకపోలేదు. మరోవైపు కొందరు వలసదార్లు శ్రామిక్ రైళ్లలో వెళ్లేందుకు ఆన్లైన్లో బుక్చేసుకున్నా సరైన స్పందన రాలేదని వాపోయారు. అనుమతుల కోసం పోలీస్స్టేషన్ల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోయిందని ఉమేశ్ కుమార్ అనే ఓ కార్మికుడు వివరించారు. ఈ నేపథ్యంలోనే కష్టమైనా ఇలా వెళ్లేందుకే మొగ్గుచూపతున్నానని ఆయన అన్నారు. ఇదిలా ఉండగా, వలసదార్లు ఇంటికి చేరుకునే క్రమంలో చాలా మంది రోడ్డు ప్రమాదాలకు గురౌతున్నారు. ముఖ్యంగా లారీల్లో వెళ్లేవారు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతుండడం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శివసేన నేతను తీసుకెళ్లాల్సిన హెలికాప్టర్కు ప్రమాదం..
శివసేన(ఉద్ధవ్ ఠాక్రే) నేత సుష్మా అంధారేకు ప్రమాదం తప్పింది. -
హెచ్డీ రేవణ్ణ, ప్రజ్వల్పై కిడ్నాప్, అత్యాచారం కేసులు..
మహిళలపై లైంగిక వేధింపులు, అపహరణల అంశానికి సంబంధించి హెచ్డీ దేవెగౌడ కుమారుడు రేవణ్ణ, మనవడు ప్రజ్వల్పై కేసులు నమోదయ్యాయి. -
బెంగాల్ గవర్నర్పై లైంగిక వేధింపుల ఆరోపణలు.. స్పందించిన రాజ్భవన్
లోక్సభ ఎన్నికలతో దేశవ్యాప్తంగా రాజకీయంగా వాడీవేడీ వాతావరణం నెలకొన్న సమయంలో పశ్చిమ్ బెంగాల్ (West Bengal)లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. -
‘ఆడబిడ్డలు ఓడిపోయారు.. అతడే గెలిచాడు’: బ్రిజ్ భూషణ్ కుమారుడికి టికెట్పై సాక్షి పోస్ట్
Sakshee Malikkh: లోక్సభ ఎన్నికల్లో బ్రిజ్ భూషణ్ కుమారుడికి భాజపా టికెట్ ఇవ్వడాన్ని ప్రముఖ రెజ్లర్ సాక్షి మలిక్ తీవ్రంగా ఖండించారు. ఈ నిర్ణయంతో కోట్లాది మంది ఆడపిల్లల మనోధైర్యాన్ని దెబ్బతీశారని భావోద్వేగానికి గురయ్యారు. -
మీసం, గడ్డం పెంచారని 80 మంది కార్మికులపై వేటు
హిమాచల్ప్రదేశ్లోని సోలన్ జిల్లాలో ఓ కంపెనీ యాజమాన్యం విచిత్ర కారణంతో కార్మికులను ఉద్యోగం నుంచి తీసేసింది. -
2జీ స్పెక్ట్రమ్పై కేంద్రం అభ్యర్థనకు సుప్రీంకోర్టు రిజిస్ట్రీ తిరస్కరణ
స్పెక్ట్రమ్ వంటి అరుదైన దేశ సహజ వనరుల కేటాయింపులు, బదిలీలకు పారదర్శకమైన వేలం విధానాన్ని మాత్రమే అనుసరించాలన్న 2012నాటి సుప్రీంకోర్టు తీర్పులో మార్పులు కోరుతున్న కేంద్ర ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. -
వాహనదారులు చల్లగా ఉండాలని.. ట్రాఫిక్ సిగ్నళ్ల దగ్గర గ్రీన్ నెట్స్
రోజురోజుకూ ఎండలు మండిపోతున్నాయి. అత్యధిక ఉష్ణోగ్రతలతో పలు రాష్ట్రాలు నిప్పుల కొలిమిలా మారుతున్నాయి. -
మా ఎన్నికల ప్రక్రియలో జోక్యమే
మత స్వేచ్ఛ విషయంలో భారత్ ఉల్లంఘనలకు పాల్పడుతోందని అమెరికా సంస్థ పేర్కొనడాన్ని మన దేశం తీవ్రంగా తప్పుబట్టింది. -
ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు లుక్ఔట్ నోటీసులు
అత్యాచారం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటకలోని హాసన ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు ప్రత్యేక దర్యాప్తు దళం(సిట్) అధికారులు గురువారం లుక్ఔట్ నోటీసులు జారీ చేశారు. -
సీబీఐ.. కేంద్రం నియంత్రణలో ఉండదు
కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ.. తమ నియంత్రణలో ఉండదని గురువారం సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపింది. ఆ సంస్థ చేసే దర్యాప్తును కూడా తాము పర్యవేక్షించబోమని పేర్కొంది. -
శ్రీకృష్ణ జన్మభూమి ఆలయం రక్షిత కట్టడం
మథురలోని శ్రీకృష్ణ జన్మభూమి ఆలయం-షాహి ఈద్గా మసీదు వివాదంలో గురువారం అలహాబాద్ హైకోర్టులో విచారణ కొనసాగింది. -
కొత్త నేర న్యాయ చట్టాలపై శిక్షణకు సహకరించండి
జులై 1 నుంచి అమల్లోకి వస్తున్న మూడు నూతన నేర న్యాయ చట్టాల(భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియమ్)ను సమర్థంగా అమలు చేసేందుకు పోలీసులకు శిక్షణ ఇచ్చేందుకు కేంద్ర హోం మంత్రిత్వశాఖ రాష్ట్రాల సహాయం కోరింది. -
కొత్తరకం జీవికి చంద్రయాన్ పేరు
భారత్కు అంతర్జాతీయ ఖ్యాతిని తెచ్చిపెట్టిన చంద్రమండల అన్వేషణ వ్యోమనౌక ‘చంద్రయాన్’కు అరుదైన గౌరవం దక్కింది. -
దిల్లీ మహిళా కమిషన్లో 52 మంది ఒప్పంద ఉద్యోగుల తొలగింపు
దిల్లీ మహిళా కమిషన్ (డీసీడబ్ల్యూ)లో అక్రమంగా నియమితులైన 52 మంది ఒప్పంద ఉద్యోగులను స్త్రీ, శిశు అభివృద్ధి (డబ్ల్యూసీడీ) శాఖ తొలగించారు. -
డిప్లొమాటిక్ పాస్పోర్ట్తో జర్మనీకి ప్రజ్వల్.. విదేశాంగ శాఖ వెల్లడి
లైంగిక దౌర్జన్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రజ్వల్ రేవణ్ణ డిప్లొమాటిక్ పాస్పోర్టుతో దేశం విడిచి వెళ్లినట్లు కేంద్రం విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు (Latest News)
-
రివ్యూ: ఆ ఒక్కటీ అడక్కు.. అల్లరి నరేష్ ఖాతాలో హిట్ పడిందా?
-
అత్యుత్తమ ఫామ్ అందుకోలేదు... నా బెస్ట్ ఇన్నింగ్స్ ఇది కాదు: రియాన్
-
శివసేన నేతను తీసుకెళ్లాల్సిన హెలికాప్టర్కు ప్రమాదం..
-
భారాస ఎమ్మెల్సీ దండె విఠల్ ఎన్నిక చెల్లదు: హైకోర్టు సంచలన తీర్పు
-
50 గంటల బ్యాటరీ లైఫ్తో నాయిస్ పాప్ బడ్స్.. ధర, ఫీచర్లివే..!
-
ఆ ముగ్గురి వల్లే మేం గెలిచాం.. ప్రతి ఓవరూ సవాలే: ట్రావిస్ హెడ్