సిసోదియాకు స్వల్ప ఊరట
మద్యం కుంభకోణం కేసులో అరెస్టయి తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి, ఆప్ నేత మనీశ్ సిసోదియాకు శుక్రవారం స్వల్ప ఊరట లభించింది.
అనారోగ్యంతో ఉన్న భార్యను చూసేందుకు అనుమతి
దిల్లీ: మద్యం కుంభకోణం కేసులో అరెస్టయి తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి, ఆప్ నేత మనీశ్ సిసోదియాకు శుక్రవారం స్వల్ప ఊరట లభించింది. అనారోగ్యంతో బాధపడుతున్న భార్య సీమాను చూసి వచ్చేందుకు దిల్లీ హైకోర్టు ఆయనకు కొన్ని గంటల పాటు అనుమతిచ్చింది. ఇందుకు కొన్ని షరతులు విధించింది. సిసోదియా తన వెంట సెల్ఫోన్ వంటి పరికరాలను తీసుకెళ్లరాదని, ఇంటర్నెట్ను వినియోగించరాదని, మీడియాతో మాట్లాడొద్దని కోర్టు స్పష్టం చేసింది. సిసోదియాను శనివారం ఉదయం 10 గంటలకు ఆయన ఇంటికి తీసుకెళ్లి సాయంత్రం 5 గంటలకు తీసుకురావాలని తిహాడ్ జైలు సూపరింటెండెంట్ను న్యాయమూర్తి జస్టిస్ దినేశ్కుమార్ శర్మ ఆదేశించారు. సిసోదియా భార్య వైద్య పత్రాలను పరిశీలించి శనివారం సాయంత్రం లోగా నివేదిక సమర్పించాలని ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్(ఈడీ)కు జడ్జి సూచించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.