మణిపుర్‌లో వెలుగులోకి మరో దారుణం!.. ఈ నెల 2న ఘటన

జాతుల మధ్య వైరంతో అట్టుడికిపోతున్న మణిపుర్‌లో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. కుకీ తెగకి చెందిన ఓ వ్యక్తి తలను నరికిన దుండగులు...దానిని వెదురు కర్రలతో చేసిన కంచెకు వేలాడ దీశారు.

Updated : 22 Jul 2023 05:56 IST

 కుకీ తెగ వ్యక్తి తల నరికి కంచెకు తగిలించిన దుండగులు

ఇంఫాల్‌: జాతుల మధ్య వైరంతో అట్టుడికిపోతున్న మణిపుర్‌లో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. కుకీ తెగకి చెందిన ఓ వ్యక్తి తలను నరికిన దుండగులు...దానిని వెదురు కర్రలతో చేసిన కంచెకు వేలాడ దీశారు. భయంకరమైన ఈ దృశ్యాలతో కూడిన వీడియో ఒకటి శుక్రవారం ఆన్‌లైన్‌లో ప్రత్యక్షమైంది. బిష్ణుపుర్‌ జిల్లాలోని ఓ నివాసిత ప్రాంతంలో ఈ నెల 2న ఈ హత్య జరిగినట్లు తెలుస్తోంది. ఆ రోజు రాత్రి 12 గంటల సమయంలో జరిగిన ఘర్షణలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. కంచెకు వేలాదీసిన తల డేవిడ్‌కు చెందినదిగా గుర్తించారు. ఇద్దరు కుకీ మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనపై దేశవ్యాప్తంగా ఆగ్రహం, ఆందోళన వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. ఆ అమానుష ఘటన బాహ్య ప్రపంచానికి తెలిసిన తరుణంలోనే మరో దారుణం సభ్య సమాజాన్ని నివ్వెరపాటుకు గురిచేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు